Amaravati: ఒకే ఒక్క ప్రాజెక్ట్.. లక్షన్నర కోట్ల పెట్టుబడి! ఏపీ తలరాత మారబోతోందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని మలుపు తిప్పే విధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద 'ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా' (AMNS India) రాబోతోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద భారీ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మార్చి 23న) శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి (Amaravati) నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు ఈ ప్రాజెక్టు శంకుస్థాపను రానున్నారు.

CM Naidu to lay foundation for AMNS steel project on March 23 jobs real estate business growth Amaravati

లక్ష మందికి ఉపాధి అవకాశాలు!

ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, ఇది రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఒక వరం. దాదాపు రూ. 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఒక లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రెండు దశల్లో ఈ ప్లాంట్‌ను అభివృద్ధి చేయనున్నారు.

రియల్ ఎస్టేట్, వ్యాపార వృద్ధి

నక్కపల్లి ప్రాంతంలో ఈ స్థాయి భారీ పరిశ్రమ రావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి భారీ డిమాండ్ ఏర్పడనుంది. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్‌గా మారబోతోంది. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన అనుబంధ పరిశ్రమలు, సర్వీస్ సెంటర్లు రావడం వల్ల స్థానిక వ్యాపారాలు ఊపందుకుంటాయి. స్టీల్ ప్లాంట్ మోడల్‌ను పరిశీలించిన అనంతరం సీఎం పలు కీలక ఒప్పందాలపై (MoUs) సంతకాలు చేయనున్నారు.

రవాణా, మౌలిక సదుపాయాల విప్లవం

ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు ప్రభుత్వం రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్లాంట్‌ను జాతీయ రహదారి (NH-16)కి అనుసంధానిస్తూ అత్యాధునిక ఫోర్-లేన్ రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా, రూ. 11,198 కోట్ల అదనపు పెట్టుబడితో 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 'సొంత పోర్టు'ను కూడా AMNS నిర్మిస్తోంది. దీనివల్ల ఎగుమతి, దిగుమతులు సులభతరం కావడమే కాకుండా, రవాణా రంగంలో మరో 6,000 మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి.

ఏదేమైనా అమరావతి (Amaravati) వేదికగా ఏపీని పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలని సంకల్పించిన ప్రభుత్వం.. ఈ స్టీల్ ప్లాంట్‌తో ఒక పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వంటి ప్రముఖులు పాల్గొంటున్నారు. లక్ష్మీ మిట్టల్ వంటి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు ఏపీకి రావడం రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏపీ స్టీల్ మార్కెట్‌లో అగ్రగామిగా నిలవడం ఖాయం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+