ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని మలుపు తిప్పే విధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద 'ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా' (AMNS India) రాబోతోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద భారీ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మార్చి 23న) శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి (Amaravati) నుండి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు ఈ ప్రాజెక్టు శంకుస్థాపను రానున్నారు.

లక్ష మందికి ఉపాధి అవకాశాలు!
ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, ఇది రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఒక వరం. దాదాపు రూ. 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఒక లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రెండు దశల్లో ఈ ప్లాంట్ను అభివృద్ధి చేయనున్నారు.
రియల్ ఎస్టేట్, వ్యాపార వృద్ధి
నక్కపల్లి ప్రాంతంలో ఈ స్థాయి భారీ పరిశ్రమ రావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి భారీ డిమాండ్ ఏర్పడనుంది. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్గా మారబోతోంది. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన అనుబంధ పరిశ్రమలు, సర్వీస్ సెంటర్లు రావడం వల్ల స్థానిక వ్యాపారాలు ఊపందుకుంటాయి. స్టీల్ ప్లాంట్ మోడల్ను పరిశీలించిన అనంతరం సీఎం పలు కీలక ఒప్పందాలపై (MoUs) సంతకాలు చేయనున్నారు.
రవాణా, మౌలిక సదుపాయాల విప్లవం
ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు ప్రభుత్వం రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్లాంట్ను జాతీయ రహదారి (NH-16)కి అనుసంధానిస్తూ అత్యాధునిక ఫోర్-లేన్ రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా, రూ. 11,198 కోట్ల అదనపు పెట్టుబడితో 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 'సొంత పోర్టు'ను కూడా AMNS నిర్మిస్తోంది. దీనివల్ల ఎగుమతి, దిగుమతులు సులభతరం కావడమే కాకుండా, రవాణా రంగంలో మరో 6,000 మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి.
ఏదేమైనా అమరావతి (Amaravati) వేదికగా ఏపీని పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలని సంకల్పించిన ప్రభుత్వం.. ఈ స్టీల్ ప్లాంట్తో ఒక పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వంటి ప్రముఖులు పాల్గొంటున్నారు. లక్ష్మీ మిట్టల్ వంటి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు ఏపీకి రావడం రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏపీ స్టీల్ మార్కెట్లో అగ్రగామిగా నిలవడం ఖాయం.
More From GoodReturns

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications