మూడు జోన్లతో ఏపీని అభివ‌ృద్ధిలో పరుగులు పెట్టిస్తాం.. సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక మండలాలు (Special Development Zones) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో జరిగిన అనధికారిక చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రం మొత్తం సమానంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం దీర్ఘకాల ప్రణాళికతో ముందుకు సాగుతుందని సీఎం స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, వేగవంతమైన ఆర్థిక వృద్ధి, ఉద్యోగావకాశాలు పెంచడానికి ప్రత్యేక మండలాలు కీలక భూమిక పోషిస్తాయని చెప్పారు. ఈ ప్రత్యేక జోన్లు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల పెట్టుబడులు, మౌలిక వసతులు, అత్యాధునిక సాంకేతికతల ప్రోత్సాహం, ఎగుమతులను పెంచడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రధాన దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

AP Andhra development zones AP growth strategy regional balanced development AP Visakhapatnam zone Amaravati zone Tirupati zone North Andhra development Rayalaseema growth AP Coastal Andhra investment AP industrial zones new economic zones AP AP govt economic reforms AP investment opportunities AP infrastructure projects Chandrababu Naidu development agenda AP regional growth model Special Economic Zones Andhra SEZ AP development Andhra future growth roadmap

అమరావతి అభివృద్ధి అంశంపై సీఎం మాట్లాడుతూ.. అమరావతి రైతుల న్యాయమైన డిమాండ్లకు తాము అండగా ఉంటామని చెప్పారు. అమరావతి ప్రాంత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఏర్పాటు చేయాలని రైతులకు సూచించారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం జెఎసి‌తో చర్చలు కొనసాగిస్తుందని తెలిపారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం వృథా కాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు.

అమరావతి రైతులకు మూలధన లాభాలపై మినహాయింపును పొడిగించాలనే అభ్యర్థనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇప్పటికే తెలియజేశామని, త్వరలో కేంద్రం అనుకూల నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. రైతులపై ఒత్తిడులు, అక్రమ రీతుల్లో దోపిడీ చేయడానికి ప్రయత్నించే ఉద్యోగులు కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, త్వరలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజా భాగస్వామ్యంతో పారదర్శక పాలనను అమలు చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులతో జరిగిన సమావేశంలో ప్రారంభంలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నప్పటికీ, ఆపై వచ్చిన చర్చలతో అన్ని విషయాలు స్పష్టమయ్యాయని, ఇప్పుడు రైతులు సంతృప్తిగా ఉన్నారని వివరించారు.

ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో కీలకమైన మార్పుల విషయానికి వస్తే..సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న విజయానంద్ డిసెంబర్ 2024లో బాధ్యతలు స్వీకరించారని నిబద్ధతతో వ్యవహరించి రాష్ట్ర పరిపాలనకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన పదవీకాలం ఫిబ్రవరి 28, 2026న ముగియనుండగా.. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ మార్చి 1, 2026న కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలబెట్టే దిశగా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నదని, ప్రజల ఆశలను నిలబెట్టడం తమ కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+