Green Hydrogen: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పారిశ్రామికంగా ఏపీ వేగంగా అభివృద్ధిని సాధిస్తోంది. ఈ క్రమంలో కొత్త కంపెనీలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో మరో కంపెనీ అడుగుపెట్టింది.
ఏపీ సీఎం నారా చంద్రబాబు సోమవారం హీరో ఫ్యూచర్ ఎనర్జీకి సంబంధించిన రూ.1,000 కోట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును తిరుపతిలోని రాక్మన్ ఇండస్ట్రీస్లో వర్చువల్గా ప్రారంభించారు. ప్లాంట్ గ్రీన్ హైడ్రోజన్ను పైప్డ్ నాచరల్ గ్యాస్, లిక్విఫైడ్ నాచరల్ గ్యాస్ తో మిక్స్ చేసి పరిశ్రమల్లో వేడి ఉత్పత్తి కోసం ఉపయోగించడానికి రూపొందించబడింది. ఇది పరిశ్రమల డీకార్బనైజేషన్లో ఒక ముఖ్యమైన సాధనంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తిరుపతిలో ఏర్పాటు చేయబడిన తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఇదే అని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్లాంట్ 300 kW PEM ఎలక్ట్రోలైజర్ కలిగి ఉండగా.. 1.1 MWp సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా విద్యుత్తుతో నడుస్తుంది. ఈ ప్లాంట్ LPGలో గ్రీన్ హైడ్రోజన్ను 10 శాతం, PNGలో 3 శాతం మిక్స్ చేయగలదు. ప్రస్తుతం ఏర్పాటైన ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 2000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది ఏడాది 25 టన్నుల (TPA) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. భవిష్యత్తులో అవసరాలకు ప్లాంట్ ఉత్పత్తిని 54 TPA వరకు విస్తరించగలదని అధికారిక ప్రకటనలో తెలిపింది.
పర్యావరణంపై ఈ ప్రాజెక్ట్ ప్రభావాన్ని పరిశీలిస్తే.. 206 TPA కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గిరణలను తగ్గించి, 195 TPA ఆక్సిజన్ను వాయుమండలంలో విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు భారత క్లీన్ ఎనర్జీ వైపు వేస్తున్న అడుగులకు కొత్త మార్గదర్శినిగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పరిశ్రమలకు హైడ్రోజన్ ఆధారిత పరిష్కారాలను ఆమోదించేందుకు ఇన్నొవేటివ్ పరిష్కారాలను అందిస్తుంది. పెద్ద మౌలిక సదుపాయాలపై ఆధారపడకుండా గ్రీన్ హైడ్రోజన్ను అనుసరించవచ్చు. ఆంధ్రప్రదేశ్ శాశ్వతమైన స్వచ్చమైన ఎనర్జీ దిశగా ముందుకు పోవడం "SwarnaAndhra@2047" దృష్టిని అనుసరించడం అని అన్నారు.
రానున్న 5 ఏళ్లలో 160 GW పెరుగుదల శక్తి సామర్థ్యాన్ని కలిగించేందుకు 119 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు లక్ష్యంగా ఉంది. ఎక్కువ తీర ప్రాంతంతో పోర్టులను కలిగి ఉన్న ఏపీ తన లాజిస్టిక్ నెట్వర్క్తో పరిశ్రమలకు అనుకూల పాలసీలతో గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు గ్లోబల్ హబ్గా మారాలని భావిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications