ఈ రంగాలకు కూడా రుణహామీ పథకం అవసరం

ఆతిథ్యం, టూరిజం, విమానయానం, రిటైల్ వంటి తీవ్ర ఒత్తిడిలో ఉన్న రంగాలకు అత్యవసర రుణ పరపతి హామీ పథకాన్ని (ECLGS) విస్తరింప చేయాలన కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(CII) లేఖ రాసింది. ఈ రంగాలను ఎక్కువకాలం వదిలేస్తే ఆర్థిక రికవరీకి విఘాతం కలుగుతుందని పేర్కొంది. ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉండే ఈ రంగాలను ఆధుకుంటే ఆర్థిక రికవరీ వేగవంతమవుతుందని తెలిపింది. ఈ రంగాలకు ప్యాకేజీ ప్రకటిస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది.

ఆర్థిక వ్యవస్థ రికవరీకి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వానికి ఆదాయపరంగా వచ్చిన ఇబ్బంది తమకు తెలుసునని తెలిపింది. కానీ ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన తరహాలో ఈ రంగాలకు మద్దతు అవసరమని వెల్లడించింది. ఎమర్జెన్సీ లోన్ క్రెడిట్ గ్యారెంటీ స్కీం(ECLGS)ను కేంద్ర ప్రభుత్వం మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద రూ.3 లక్షల కోట్లను ప్రకటించింది.

CII writes to finance ministry, suggests ECLGS scheme for stressed sectors

ECLGS కింద ఇప్పటికే రూ.1.48 లక్షల కోట్లను ఎంఎస్ఎంఈలకు అందించారు. రూ.2.03 లక్షల కోట్లు మంజూరు చేశారు. ఈ స్కీం గడువు అక్టోబర్ 31వ తేదీన ముగిసింది. అయితే స్కీం లక్ష్యం రూ.3 లక్షల కోట్లను అందుకోకపోవడంతో నవంబర్ 30వ తేదీకి పొడిగించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+