ఆర్థిక మాంద్యం భయం ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. దీంతో ఎక్కువగా జీతాలు తీసుకున్న ఐటీ ఉద్యోగుల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు నష్టాలను తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి.
తాజాగా చిప్మేకర్ ఇంటెల్ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మూడు నెలల జీతం లేని సెలవులతో వేలాదిమంది పారిశ్రామిక కార్మికులను ఇంటికి పంపిస్తోంది. ఇంటెల్ ఉద్యోగుల తొలగింపు ప్రాసెస్ కాలిఫోర్నియా నుంచి ప్రారంభమైంది. ఇక్కడ కనీసం 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.

"వర్కర్ అడ్జస్ట్మెంట్, స్ట్రెయినింగ్ నోటిఫికేషన్ల" ప్రకారం, కాలిఫోర్నియాలోని ఇంటెల్ ఫోల్సమ్లో 111 మంది ఉద్యోగులను తొలగించారు. అక్టోబరులో ఇంటెల్ విక్రయాల విభాగంలో "మానవ వ్యయాలను" తగ్గించడానికి తన ప్రణాళికలను ప్రకటించింది.ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తుంది.ఇంటెల్ సంవత్సరానికి 8-10 బిలియన్ల డాలర్లమేర ఆదా చేయాలని భావిస్తోందట.
ప్రస్తుత పరిస్థితికి తగినట్టుగా ఖర్చులను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అక్టోబరులో కంపెనీ మూడవ త్రైమాసిక ఫలితాల సందర్భంగా పేర్కొంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పీసీ విక్రయాలు పడిపోవడంతో ఉద్యోగుల తొలగింపనకు కారణంగా చెబుతున్నారు.

Meta, Twitter, Salesforce, Netflix, Cisco, Rokuతో పాటు అనే కంపెనీలు ఉద్యోగులను తొలగించారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 853 కంప్యూటర్ వ్యాపార సంస్థలు దాదాపు 137,492 మంది ఉద్యోగులను తొలగించాయి. రాబోయే మాంద్యం గురించి ఆందోళనల మధ్య వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఐటీ కంపెనీల్లో ఉంటుంది. ఎందుకంటే ఐటీ ఎక్కువగా జీతాలు వచ్చే ఉన్నారని.. అందుకే కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలని ఎక్కువ జీతం ఉన్నవారిని తొలగిస్తున్నాయి. మెటా 11000 మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ 10000, ట్విట్టర్ 3700, మైక్రోసాఫ్ట్ 3000 మంది ఉద్యోగులను తొలగించింది.


Click it and Unblock the Notifications