Jack Ma: చైనీస్ బిలియనీర్ పై చైనా ప్రభుత్వం కనికరం..! యాంట్ గ్రూప్ IPOకు సన్నాహాలు..
Alibaba Group: జాక్ మా కు మంచి రోజులు మెుదలయ్యాయా.. అలీబాబా గ్రూప్ కు మల్లీ మంచి టైం వచ్చిందా? ఆయనపై చైనా ప్రభుత్వం కనికరం చూపిస్తోందా? ఇప్పుడు పరిస్థితులు చూస్తుండే అలాగే ఉంది. బిలియనీర్ జాక్ మా నేతృత్వంలోని ఫిన్టెక్ దిగ్గజం.. యాంట్ గ్రూప్ IPOను పునరుద్ధరించడానికి చైనీస్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు ప్రారంభ దశ చర్చల్లో నిమగ్నమై ఉన్నట్లు న్యూస్ ఏషియా కథనం ప్రకారం తెలుస్తోంది.
చైనా
సెక్యూరిటీస్
రెగ్యులేటరీ
ఏమంటోంది..
బిలియనీర్
జాక్
మా
నేతృత్వంలోని
ఫిన్టెక్
కంపెనీ
వాటా
విక్రయ
ప్రణాళికలను
తిరిగి
అంచనా
వేయడానికి
చైనా
సెక్యూరిటీస్
రెగ్యులేటరీ
కమిషన్
(CSRC)
ఒక
బృందాన్ని
ఏర్పాటు
చేసిందని
సోర్సెస్
చెబుతున్నాయి.
చైనా
ఇంటర్నెట్
రంగాన్ని
సులభతరం
చేయడానికి
ప్రభుత్వం
తన
అధికారిక
వాగ్దానాలను
నిలబెట్టుకుంటుందనడానికి
ఇది
సంకేతం
కావచ్చు,
ఇది
పెట్టుబడిదారులకు
బాగా
ఉపయోగపడుతుందని
తెలుస్తోంది.
చైనీస్
రెగ్యులేటర్లు
రైడ్-హెయిలింగ్
దిగ్గజం
దీదీ
గ్లోబల్
ఇంక్,
మరో
రెండు
సంస్థలపై
తమ
ఇన్వెస్టిగేషన్
ను
ముగిస్తున్నందున..
ఈ
వారంలో
దేశీయ
యాప్
స్టోర్లకు
తిరిగి
రావడానికి
సదరు
సంస్థల
యాప్లను
అనుమతించవచ్చు.
కానీ..
యాంట్
IPO
గురించి
వస్తున్న
వార్తలను
చైనా
సెక్యూరిటీస్
రెగ్యులేటరీ
కమిషన్
తిరస్కరించిందని
తెలుస్తోంది.
అలీబాబా
షేర్లపై
ప్రభావం:
మెయిన్ల్యాండ్
చైనా,
ఓవర్సీస్,
Investing.comలో
జాబితా
చేయడానికి
అర్హత
ప్రమాణాలకు
అనుగుణంగా
ఉన్న
కంపెనీలకు
మాత్రమే
మద్దతు
ఇస్తుందని
తెలుస్తోంది.
యాంట్
గ్రూప్లో
అలీబాబా
33%
వాటా
కలిగి
ఉంది.
ఈ
వార్తల
తరుణంలో
గురువారం
అలీబాబా
షేర్
ఆరంభంలో
5
శాతం
పెరిగినప్పటికీ
చివరికి
3.5%
పడిపోయాయి.
2020
నవంబర్లో
షాంఘై,
హాంకాంగ్లలో
యాంట్
తన
రికార్డ్
37
బిలియన్
డాలర్ల
IPO
కోసం
రంగం
సిద్ధం
చేసుకుంది.
చైనా
మార్కెట్లలోకి
అది
రావటానికి
కొన్ని
రోజుల
ముందు
డీల్ను
చైలా
ప్రభుత్వ
రెగ్యులేటరీ
నిలిపివేసింది.
ప్రస్తుతం
వస్తున్న
వార్తలు
కేవలం
ఊహాగానాలేనా
లేక
చైనా
ప్రభుత్వంతో
జాక్
మా
కు
సయోధ్య
కుదిరిందా
అనే
విషయం
పూర్తి
స్థాయిలో
తెలియాల్సి
ఉంది.