అమెరికా-చైనా సంబంధాలు ఇటీవలి కాలంలో ప్రపంచ దేశాల దృష్టిని మరింతగా ఆకర్షిస్తున్నాయి. దక్షిణ కొరియాలోని బుసాన్లో అక్టోబర్ 30న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశం అంతర్జాతీయంగా కీలక ఘట్టంగా మారింది. ఆ సమావేశంలో వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇద్దరు నాయకులు తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్ని అనేక మంది శాంతియుత దౌత్యపరమైన ముందడుగుగా భావించినప్పటికీ, ఆ సంబంధాల అసలు భవిష్యత్తు ఇంకా స్పష్టంగా లేదు. ఎందుకంటే, ఇదే సమయంలో చైనాలో జరిగిన మరో ముఖ్యమైన పరిణామం ప్రపంచ స్థాయి శక్తిసమీకరణల భవిష్యత్తును మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
అక్టోబర్ 20 నుంచి 23 వరకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ బీజింగ్లో నాల్గవ ప్లీనమ్ను నిర్వహించింది. ఈ సమావేశం చైనా పదిహేనవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనకు సంబంధించిన ప్రధాన దిశను నిర్ణయించింది. చివరి రూపం 2026 మార్చిలో అధికారికంగా విడుదల కానున్నప్పటికీ, ఇప్పటివరకు బయటకు వచ్చిన సంక్షిప్త ప్రకటన చైనాను ఏ దిశగా తీసుకెళ్లాలని బీజింగ్ నిర్దేశించుకున్నదనే దానిపై స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఈ ప్రణాళిక ప్రభావం కేవలం చైనా ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా.. అమెరికా ఆర్థికరంగం, సాంకేతిక పరిశ్రమ, అంతర్జాతీయ నాయకత్వం, ముఖ్యంగా అమెరికా జాతీయ భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.

వ్యూహాత్మక మార్గదర్శక పత్రాలుగా పంచవర్ష ప్రణాళికలు: 1970లలో హెన్రీ కిస్సింజర్కు ఆర్థిక సలహాదారుగా పనిచేసినప్పటి నుంచి పలుమార్లు చైనాను సందర్శించిన అమెరికన్ ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పంచవర్ష ప్రణాళికలు కాలక్రమేణా పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు చైనా వీటిని ఉక్కు, ధాన్యం, సిమెంట్ వంటి నిర్దిష్ట ఉత్పత్తుల లక్ష్యాలను నిర్ణయించే సోవియట్ నమూనాలో రూపొందించేది. కానీ డెంగ్ జియావోపింగ్, Zhu Rongji కాలం నుంచి అవి మార్కెట్ ఆధారిత దిశలను సూచించే వ్యూహాత్మక మార్గదర్శక పత్రాలుగా మారాయి. చైనీస్ లక్షణాలతో కూడిన సోషలిజం అనే భావన తరువాతి దశాబ్దాల్లో వచ్చిన ఆర్థిక, సాంకేతిక పురోగతికి పునాదిగా నిలిచిందన్నారు.
చైనా లక్ష్యం పూర్తిగా మారింది: తాజా ప్లీనరీలో ఉద్ఘాటించిన ప్రధాన అంశాలలో ఒకటి అధిక నాణ్యతా అభివృద్ధి. అంటే చైనా ఇక చౌక ఉత్పత్తుల సూపర్ పవర్ నుండి అధునాతన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రపంచ నాయకుడిగా ఎదగాలని లక్ష్యపెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, AI ఆధారిత కమ్యూనికేషన్ టెక్నాలజీలు, ప్యానెల్స్ వంటి రంగాలలో China ఇప్పటికే అమెరికాను సవాల్ చేసే స్థాయికి వచ్చింది.ఈ ప్రకటనలో మరో ప్రాధాన్యత సంస్కరణ, ఆవిష్కరణ దేశానికి ప్రధాన డ్రైవింగ్ ఫోర్స్ అవుతుందని పేర్కొంది. ముఖ్యంగా సాంకేతిక స్వావలంబన, పరిశోధన-అభివృద్ధి సామర్థ్యాల పెంపు, AI, సెమీకండక్టర్లు, రోబోటిక్స్ వంటి రంగాలలో ప్రపంచ ఆధిపత్యం సాధించడంపై దృష్టి పెట్టనుంది.
ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే ఈ ప్రణాళికలో సాంకేతికత, సైన్యం మధ్య మరింత సన్నిహిత సమన్వయం చేపట్టే దృక్పథాన్ని స్పష్టంగా ప్రకటించారు. రక్షణ రంగంలో ఆధునిక సాంకేతికతను వేగంగా వినియోగించగల పౌర పరిశ్రమల అభివృద్ధి ద్వారా సైనిక పురోగతిని వేగవంతం చేయడమే లక్ష్యం. ఇటీవల ఇన్నర్ మంగోలియాలో నిర్వహించిన లైవ్ ఫైర్ డ్రోన్ పరీక్షలు ఇందులో ఉన్న సామర్థ్యాన్ని ఇప్పటికే ప్రపంచానికి చూపించాయి.
అమెరికాను టార్గెట్ చేసిన చైనా: చైనా ఇటీవల విడుదల చేసిన తన కొత్త పంచవర్ష ప్రణాళిక ప్రకటనలో అమెరికా పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, దాగి ఉన్న సందేశాలు స్పష్టంగా అమెరికాపై ఉద్దేశించినట్లుగానే ఉన్నాయి. భారీ గాలులు, అల్లకల్లోల జలాలు, ప్రమాదకర తుఫానులు వంటి ఉపమానాలు రాబోయే తీవ్ర అంతర్జాతీయ పోటీతత్వాన్ని సూచిస్తున్నాయి. ఇదే సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తీవ్రమైన అంతర్జాతీయ పోటీ మధ్య వ్యూహాత్మక చొరవను సాధించాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇందులో ముఖ్యంగా ఉద్దేశించబడిన దేశం అమెరికానే. చైనా ఇతరుల చేతికి బానిస కాదని జిన్పింగ్ చెప్పడం వెనుక బలమైన వ్యూహాం దాగి ఉంది. చైనా విదేశీ సాంకేతికతపై ఆధారాన్ని తొలగించడం అత్యంత ప్రధానంగా భావిస్తోంది.
చైనా సాంకేతిక ముందడుగు ఇప్పుడు అమెరికాను ప్రత్యక్షంగా లక్ష్యంగా చేసుకుంది. అధునాతన డ్రోన్లు, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, చిప్ తయారీ, 5G, AI, సౌరశక్తి, బ్యాటరీలు, బుల్లెట్ రైళ్ల రంగాలలో చైనా ఇప్పటికే వేగంగా అమెరికాకు పోటీ ఇస్తోంది. ఒకప్పుడు చైనా వృద్ధి ప్రధానంగా విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కాపీ చేసే విధానంపై ఆధారపడింది, కానీ ఇప్పుడు స్వదేశీ ఆవిష్కరణ (Indigenous Innovation) అనే నమూనా ద్వారా ప్రపంచానికి కొత్త ప్రమాణాలు స్థాపిస్తోంది.
సాంకేతికతతో సవాల్: చైనాలో అధునాతన సాంకేతిక అభివృద్ధికి భారీగా జరుగుతున్న పెట్టుబడులు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పెట్టుబడుల్లో కొంత భాగం విదేశీ ప్రైవేట్ మూలధనం నుండి వస్తున్నప్పటికీ, ప్రధాన భాగం చైనా ప్రభుత్వమే సమకూరుస్తోంది. Huawei, BYD, CATL, ZTE వంటి చైనా కంపెనీలు టెలికమ్యూనికేషన్, EVలు, బ్యాటరీలు, 5G నెట్వర్క్లు, సౌర ప్యానల్స్ రంగాలలో భారీ విస్తరణ చేస్తున్నాయి.
ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా ఆ దేశాలలో డేటా, కమ్యూనికేషన్, రక్షణ విధానాలపై గణనీయమైన ప్రభావాన్ని సాధిస్తున్నాయి. ఇది సాధారణ వ్యాపార విస్తరణ కాదు, ప్రపంచ నియమాలను చైనా ప్రయోజనాలకు అనుగుణంగా మలచడానికి చేపట్టిన వ్యూహాత్మక కదలిక. ముఖ్యంగా సింగపూర్, మలేషియా, ఇండొనేషియా మరియు మొత్తం ఆగ్నేయాసియాతో. EVలు, సౌరశక్తి, పోర్టులు, రైలు నెట్వర్కులు మొదలైన అభివృద్ధి ప్రాజెక్టులు చైనా ప్రభావాన్ని వేగంగా పెంచుతున్నాయి.
K వీసాతో శాస్త్రవేత్తల ఆకర్షణ: చైనా నాయకత్వం భావిస్తున్నది ఏమిటంటే రాబోయే సాంకేతిక పోటీలో విజయం అత్యంత ప్రతిభావంతమైన శాస్త్రవేత్తలు, పరిశోధకులపై ఆధారపడి ఉంటుంది. గత అనేక దశాబ్దాలుగా అమెరికా లోని విశ్వవిద్యాలయాలు, నేషనల్ లాబొరేటరీస్, NSF, NIH వంటి ప్రభుత్వ ఫండింగ్ ఆధారంగా ప్రపంచ ఉత్తమ శాస్త్రవేత్తలను ఆకర్షించగలిగాయి. అయితే ప్రస్తుతం అమెరికాలో శాస్త్రీయ పరిశోధనలపై భారీ నిధుల కోతలు, వీసా పరిమితులు పెరిగాయి.
Nature జరిపిన సర్వే ప్రకారం అమెరికాలోని శాస్త్రవేత్తల్లో 75 శాతం మంది దేశం విడిచి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. వారిలో చాలామంది యువ ప్రతిభావంతులు, పోస్ట్డాక్టర్లు. ఇటువంటి పరిస్థితులను చైనా ఒక సువర్ణావకాశం గా చూస్తోంది.ఇందుకే చైనా ఇటీవల K వీసా అనే కొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది, ఇది విదేశీ శాస్త్రవేత్తలు చైనాలో స్థిరపడటానికి రూపుదిద్దుకుంది. కొత్త పంచవర్ష ప్రణాళిక కూడా ఇదే దిశగా చర్యలకు ప్రోత్సాహం ఇస్తోంది.
అగ్రరాజ్యంపై డేగ కన్ను: అమెరికాలో ఇటీవలి సంవత్సరాల్లో పెరుగుతున్న రాజకీయ విభజనలు, అంతర్గత ఘర్షణలు, శాస్త్ర-సాంకేతిక ఆవిష్కరణలకు ప్రభుత్వ మద్దతు తగ్గిపోవడం ప్రపంచం మొత్తానికి స్పష్టంగా కనిపిస్తోంది. IMF, వరల్డ్ బ్యాంక్, WTO వంటి ప్రపంచ ఆర్థిక సంస్థలను అమెరికా నిర్మించడంలో చారిత్రాత్మకంగా కీలక పాత్ర పోషించినప్పటికీ, ప్రస్తుతం వాటికి అమెరికా మద్దతు తగ్గిపోవడం గ్లోబల్ వ్యూహాత్మక దృశ్యంలో అతిపెద్ద మార్పుగా భావించబడుతోంది. ఈ పరిణామాలను చైనా లోతుగా పరిశీలిస్తోంది. ఆ అంశాలను అవకాశాలుగా మార్చుకోవాలనుకుంటోంది. ఈ పరిస్థితి అమెరికా ప్రపంచ నాయకత్వ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని చైనా అధికారులు భావిస్తున్నారు.
చైనాను వెంటాడుతున్న సమస్యలు: అయితే చైనా వ్యవస్థ పరిపూర్ణమైనది కాదు. యువత నిరుద్యోగం ఇంకా పెద్ద సమస్యగానే ఉంది. ప్రైవేట్ పెట్టుబడులు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వినియోగం తక్కువగా ఉండటం ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటోంది. AI నియంత్రణపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన దిశను కనుగొనలేకపోతోంది. విదేశీ శాస్త్రవేత్తల సమగ్రత చైనా వ్యవస్థలో ఇంకా సవాలుగా ఉంది. ఈ ప్రతికూలతలున్నప్పటికీ, వ్యూహాత్మక ప్రణాళిక, దేశీయ ఐక్యత చైనాకు ఒక బలమైన పోటీశక్తిని అందిస్తున్నాయి.
More From GoodReturns

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..



Click it and Unblock the Notifications