చైనా అమెరికా సుంకాల వార్.. ఇండియాలో ఏ వస్తువుల రేట్లు పెరుగుతాయి తగ్గుతాయంటే..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్య కారణంగా చైనా ఇబ్బందుల్లో పడింది. తాజాగా ట్రంప్ చైనాపై సుంకాలను 125%కి పెంచిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు అమెరికా చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 125% సుంకం విధిస్తుంది. ఈ దెబ్బకి చైనా కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. చైనా అమెరికాకు ఎలక్ట్రానిక్ భాగాలతో సహా పెద్ద మొత్తంలో ఉత్పత్తులను విక్రయిస్తుంది, వీటి ద్వారానే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. కానీ ఇప్పుడు అదంతా కష్టంగా మారింది.

china america reciprocal tariffs war which items may become cheaper and costlier good news for India

అమెరికన్ మార్కెట్ కష్టతరంగా మారిన తర్వాత, చైనా కంపెనీలు ఇప్పుడు భారతదేశంపై దృష్టి సారించాయి. చైనా కంపెనీలు భారతదేశానికి మరిన్ని డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ET నివేదిక ప్రకారం, అమెరికాతో సుంకాల యుద్ధంతో ఆందోళన చెందుతున్న చైనా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు ఇప్పుడు భారతదేశానికి మరింత డిస్కౌంట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నిజానికి, ప్రస్తుత ప్రపంచ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, భారతీయ కంపెనీలు కొత్త సోర్సింగ్ కాంట్రాక్టులపై చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మన దేశానికి చైనా డిస్కౌంట్లను అందిస్తోంది.

చైనా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు భారతీయ కంపెనీలకు మొత్తం ఎగుమతులపై 5% తగ్గింపును అందిస్తున్నారు. ఈ విభాగంలో ఇప్పటికే తక్కువ మార్జిన్లు ఉన్నందున ఈ తగ్గింపు పెద్ద రిలీఫ్ ఇస్తుంది. చైనా నుండి వచ్చే ఎలక్ట్రానిక్స్ భాగాలను రిఫ్రిజిరేటర్లు, టీవీలు ఇంకా స్మార్ట్‌ఫోన్‌ల వంటి ఎలక్ట్రిక్ వస్తువులలో ఉపయోగిస్తారు. డిమాండ్ పెంచడానికి భారతీయ తయారీదారులు చైనా నుండి పొందిన డిస్కౌంట్ల ప్రయోజనాలను కస్టమర్లకు అందించవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే, రాబోయే రోజుల్లో రిఫ్రిజిరేటర్ల నుండి స్మార్ట్‌ఫోన్‌ల వరకు ప్రతిదాని ధర మరింతగా తగ్గవచ్చ్చు.

అమెరికా తర్వాత, చైనాకు భారతదేశం అతిపెద్ద మార్కెట్. చైనా అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, బొమ్మలు, బట్టలు, వీడియో గేమ్స్, లిథియం-అయాన్ బ్యాటరీలు, హీటర్లు, ఫర్నిచర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఆటోమోటివ్ విడిభాగాలు ఇంకా అసేసోరీస్, వైద్య పరికరాల వరకు ఎన్నో రకాల ఉత్పత్తులను విక్రయిస్తుంది. అమెరికా భారీ సుంకాలను విధిస్తుండటంతో ఇప్పుడు అమెరికా చైనాకి లాభదాయకమైన మార్కెట్‌గా ఉండదు. ఈ పరిస్థితిలో చైనా కంపెనీలు భారతదేశంతో పెద్ద ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటాయి, అందుకే డిస్కౌంట్లను అందించాల్సి ఉంటుంది. దీని అర్థం అమెరికా అండ్ చైనా మధ్య పోరాటం నుండి భారతీయ ప్రజలు ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇండియా ఒక బెస్ట్ అప్షన్ అవుతుంది: సుంకాల ముద్దానికి చైనా సొంత భాషలోనే అమెరికాకు నిరంతరం స్పందిస్తోంది. అమెరికా విధించిన 104% సుంకానికి ప్రతిస్పందనగా, అమెరికా వస్తువులపై చైనా సుంకాన్ని 84%కి పెంచింది. దీనిపై ఆగ్రహించిన డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై 125% సుంకాన్ని ప్రకటించారు. దీని వలన చైనీస్ అలాగే అమెరికన్ ప్రజలు ఒకరి వస్తువులను ఒకరు కొనుగోలు చేయడానికి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది లేదా ఏదైనా అల్టార్నేటివ్ వెతకవలసి ఉంటుంది.

అయితే అమెరికా ప్రకటించిన కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కానీ దీని వల్ల చైనాకు ఎలాంటి రిలీఫ్ ఉండదు, ఇంకా ఇప్పుడు 125% సుంకం వసూలు చేస్తుంది. మరోపక్క బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, ట్రంప్ వ్యాపార దిగ్గజాలు ఇంకా పెట్టుబడిదారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టాన్ని పేర్కొంటూ, వ్యాపార దిగ్గజాలు ట్రంప్ సుంకాల విధానాలను మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని చాలా మంది పెద్ద పెట్టుబడిదారులు కూడా ట్రంప్ విధానాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కారణంగానే 90 రోజుల పాటు వాయిదా వేశారు.

దీనికి సంబంధించి చైనాపై కఠినంగా వ్యవహరించడం అవసరమని చెప్పిన డొనాల్డ్ ట్రంప్, ఇతర దేశాలు ప్రతీకార చర్యలకు బదులుగా పరస్పర చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాయని అన్నారు. అలాగే చైనా దీని పట్ల తీవ్రతను సృష్టిస్తోంది. ప్రపంచ మార్కెట్ల పట్ల చైనాకి గౌరవం లేకపోవడం, చైనాపై విధించిన సుంకాన్ని తక్షణమే 125%కి పెంచుతున్నానని తృమో అన్నారు. అమెరికా ఇంకా ఇతర దేశాలను దోచుకునే రోజులు ఇకపై ఉండవని, చైనా త్వరలోనే ఈ విషయాన్నీ గ్రహిస్తుందని ఆశిస్తున్నానని ట్రంప్ అన్నారు.

అంతేకాదు జనవరిలో ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుండి ఐదుసార్లు చైనా వస్తువులపై సుంకాలను పెంచారు. అమెరికా తొలి సుంకం విధించిన తర్వాత చైనా ప్రతీకార చర్య వల్ల రెండు దేశాలకు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం లభించిందని, కానీ ట్రంప్ సుంకాన్ని మరింత పెంచడం ద్వారా ఎలాంటి అవకాశాలను లేకుండా పోయిందని నిపుణుల అభిప్రాయం.

దాదాపు కొన్ని రోజుల తర్వాత గత వారం అమెరికన్ మార్కెట్లు పూర్తిగా లాభాల్లో కనిపించాయి. ఈ కాలంలో అమెరికన్ ఇండెక్స్ నాస్డాక్ 12.16% లాభపడగలిగింది. ఎస్ అండ్ పి 500 9.52% లాభపడగా, డౌ జోన్స్ 7.87% లాభపడింది. కరోనా మహమ్మారి తర్వాత అమెరికన్ మార్కెట్లో ఇదే అతిపెద్ద సింగిల్-డే పెరుగుదల. దీన్ని బట్టి, డోనాల్డ్ ట్రంప్ కొత్త సుంకంపై 90 రోజుల నిషేధంతో మార్కెట్ ఎంత సంతోషంగా ఉందో మనం అంచనా వేయవచ్చు.

అదే సమయంలో చైనాకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వడానికి అమెరికా నిరాకరించింది. చైనా సంఘర్షణ పరిస్థితులను సృష్టిస్తున్నందున దానిపై సుంకాలను పెంచామని అమెరికా చెబుతోంది. ఇతర దేశాలు సంఘర్షణకు దూరంగా ఉండాలని కోరుకుంటుండటంతో కాస్త రిలీఫ్ పొందాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచబోమని, అమెరికా చర్యకు ప్రతిస్పందిస్తామని చైనా కూడా ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వచ్చింది.

కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని అమెరికా ప్రకటించాక, దీని వలన చైనా తప్ప ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకి చర్చలకు సమయం లభించింది. ఈ వార్త భారతదేశానికి కూడా రిలీఫ్ కలిగించేదే. దీని పై భారత ప్రభుత్వం ఇప్పటికే అమెరికాతో చర్చలు జరుపుతోంది. ట్రంప్ నిర్ణయం తర్వాత, గోల్డ్‌మన్ సాచ్స్ మాంద్యం అంచనాను ఉపసంహరించుకుంటున్నట్లు, 2025లో ఆర్థిక వృద్ధి గత అంచనాకే వస్తున్నట్లు తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+