AP News: నిర్మలమ్మకు టీమ్ చంద్రబాబు వినతులు.. బడ్జెట్లో చేర్చాలని విజ్ఞాపన..

Chandrababu Naidu: దేశంలో లోక్‌సభ ఎన్నికల కోలాహలం ముగిసిన వేళ అందరి చూపు ప్రస్తుతం కేంద్రం ప్రకటించనున్న పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ పైనే ఉంది. ఈ క్రమంలో ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రిని సంప్రదిస్తోంది.

ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే కేంద్ర బడ్జెట్‌లో చేర్చాలని కేంద్రానికి వినతుల వివరణాత్మక జాబితాను కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. ఇందుకోసం గురువారం ఏపీ ముఖ్యమంత్రి దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సమయంలో ఏపీకి అవసరమైన స్వల్పకాలిక నిధులు, అదనపు కాపెక్స్ మద్దతు కోసం ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఏపీలో ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సీబీఎన్ రాష్ట్రాన్ని తిరిగి ఆర్థిక పునరుద్ధరణ పథంలోకి తీసుకురావడానికి ఈ ఏడాది బడ్జెట్‌లో గణనీయమైన ఆర్థిక ప్యాకేజీ కోసం వ్యూహాత్మక స్థితిలో ఉంచింది.

Chandrababu naidu Gov seeks funds from Union budget 2024 submits detailed list of requests

ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు రూ.15,000 కోట్లు కోరడం ప్రాథమిక ప్రతిపాదనల్లో ఒకటిగా ఉంది. ఈ నిధులు రాజ్ భవన్, హైకోర్టు, సెక్రటేరియట్, శాసనసభ, కౌన్సిల్ వంటి అవసరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు భూమి అభివృద్ధి, ట్రంక్ మౌలిక సదుపాయాలను కవర్ చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఇదే క్రమంలో ఏపీకి చాలా కీలకమైన తాగునీరు, సాగునీరు, విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తి చేసేందుకు రాష్ట్రానికి రూ.12,100 కోట్లు అవసరం. రెండు కీలక ప్రాజెక్టులతో పాటు, వివిధ రంగాలకు సంబంధించిన డిమాండ్ల సమగ్ర జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తెచ్చింది.

ఇదే సమయంలో విజయవాడ, విశాఖ, అమరావతిలో మెట్రో ప్రాజెక్టులతో పాటు అమరావతిలో లైట్ రైల్ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బడ్జెట్ వేళ కోరుతోంది. అలాగే విజయవాడ-ముంబై, విజయవాడ- దిల్లీకి వందే భారత్ రైలును, విశాఖ-చెన్నై, విశాఖ- బెంగళూరుకు రైళ్లు ప్రవేశపెట్టాలని అభ్యర్థించింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాచరణపై కూడా చర్చించనున్నారు.

రాయలసీమ, ప్రకాశంతో సహా వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్రం గ్రాంట్లను కోరుతుంది. ఒడిశాలోని కోరాపుట్-బోలాంగీర్-కలహండి ప్రణాళిక మాదిరిగానే ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఒక విశిష్ట అభివృద్ధి కార్యక్రమం కింద రూ.24,350 కోట్ల కోసం అభ్యర్థనను తాజా ప్రతిపాదనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంచింది. ఆరేళ్లపాటు ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల వార్షిక గ్రాంట్ మొత్తం కలిపి దాదాపు రూ.2,100 కోట్లతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది.

బడ్జెట్ సమయం దగ్గర పడటంతో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రంలోని వివిధ రంగాలలో కేంద్ర మద్దతు ఆవశ్యకతను నొక్కి చెప్పారు. రామాయపట్నం ఓడరేవు, కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోలియం కారిడార్ నిర్మాణానికి కేంద్రం సహాయం ఏపీ కోరింది. మెగా టెక్స్‌టైల్ పార్క్, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్, గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుకు కూడా కేంద్ర సహాయం కోరింది. రాష్ట్ర ఆర్థిక పునరుద్ధరణకు తోడ్పాటునందించేందుకు రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అవసరమని కేశవ్ కేంద్రానికి వెల్లడించినట్లు సమాచారం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+