దావోస్‌లో చంద్రబాబు మార్క్ రాజకీయం: రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం! ఏపీ దశ మారబోతుందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరోసారి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా బాబు టీం పావులు కదుపుతోంది. లోకేష్, టి.జి. భరత్‌లతో కూడిన ఈ బృందం ఇప్పటికే పలువురు గ్లోబల్ సీఈఓలతో సమావేశమైంది.

Chandrababu Naidu Davos visit 2026 investment goals AP industrial policy Nara Lokesh global CEOs meet

ఒకే వేదికపై ఇద్దరు సీఎంల 'పెట్టుబడుల' వేట

ఈసారి దావోస్ సదస్సు ఒక ఆసక్తికరమైన పోరుకు వేదికైంది. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఇటు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇద్దరూ ఇన్వెస్టర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. సోమవారం బాబు జూరిచ్‌ లో అడుగుపెట్టగా, కొద్దిసేపటికే రేవంత్ రెడ్డి కూడా చేరుకున్నారు. జూరిచ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్‌ తో భేటీ అయిన చంద్రబాబు, ఏపీలో ఉన్న ఫార్మా, మెడికల్ ఎక్విప్‌మెంట్ రంగాల అవకాశాలను వివరించారు. ఏపీలో ఇప్పటికే 25 కొత్త పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టామని, ముఖ్యంగా ఏఐ (AI), క్వాంటం టెక్నాలజీపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.

36 మీటింగ్‌లు.. 20 లక్షల ఉద్యోగాలు!

ఈ పర్యటనలో చంద్రబాబు ఏకంగా 36 కీలక సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. ఇందులో..

  • గ్లోబల్ సీఈఓలతో భేటీ: గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలీవర్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చర్చలు.
  • రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్: యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఈ హబ్ ద్వారా మెంటార్‌షిప్ ఇస్తామని బాబు ప్రకటించారు.
  • రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్: కొత్త ఆలోచనలతో వచ్చే యువ స్టార్టప్‌ ల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

గత 18 నెలల్లో ఏపీకి సుమారు రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 20 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

'వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్‌‌ప్రెన్యూర్'.. సరికొత్త కాన్సెప్ట్!

జూరిచ్‌లో ప్రవాస ఆంధ్రులతో (Telugu Diaspora) నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన ఐడియాను పంచుకున్నారు. "ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి" అనేదే తన ప్రభుత్వ విధానమని చెప్పారు. "భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే.. ఒకరు ఉద్యోగం చేస్తూ, మరొకరు బిజినెస్ వైపు అడుగులు వేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులను చూస్తుంటే తాను విజయవాడ లేదా తిరుపతిలో ఉన్నట్లు అనిపిస్తోందని బాబు వ్యాఖ్యానించారు.

డ్రోన్ టెక్నాలజీ & ఏఐ హబ్

ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఏపీలో డ్రోన్ రంగాన్ని భారీగా అభివృద్ధి చేస్తున్నామని, 100 కేజీల బరువును మోసుకెళ్లే డ్రోన్ల తయారీపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. అలాగే 'ఈరోస్ ఇన్నోవేషన్స్' ఛైర్మన్ కిషోర్ లుల్లాతో భేటీ అయి, ఏపీలో ఏఐ క్రియేటివ్ టెక్ హబ్, డిజిటల్ కంటెంట్ ఎకానమీపై చర్చించారు.
మొత్తానికి, విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్, గత దావోస్ పర్యటనల ద్వారా వచ్చిన రూ. 2 లక్షల కోట్ల హామీలను కార్యరూపంలోకి తెస్తూనే, కొత్త పెట్టుబడుల కోసం చంద్రబాబు గట్టిగానే శ్రమిస్తున్నారు. ఇక చివరిగా గోదావరి పుష్కరాలకు అందరూ రావాలని కూడా చంద్రబాబు తన ప్రసంగంలో కోరారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+