ICICI బ్యాంకు మాజీ సీఈవో చందాకొచ్చార్ భర్త దీపక్ కొచ్చార్ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అరెస్ట్ చేసింది. వీడియోకాన్ గ్రూప్కు ఐసీఐసీఐ బ్యాంకు రుణాలిచ్చిన కేసులో మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఆయనను ఈడీ నిన్న సుదీర్ఘంగా విచారించింది. సోమవారం మధ్యాహ్నం నుండి ఆయనను విచారించి, రాత్రి అరెస్ట్ చేసింది. వీడియోకాన్ గ్రూప్కు చందాకొచ్చార్ హయాంలో ఐసీఐసీఐ బ్యాంకు రూ.1,875 కోట్ల మేర రుణాలు ఇచ్చింది. ఈ వ్యవహారంలో వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ దూత్, చందాకొచ్చార్ మధ్య క్విడ్-ప్రోకో జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
మధ్యాహ్నం నుండి జరిపిన విచారణలో ఆధారాలు లభ్యం కావడంతో దీపక్ కొచ్చార్ను అరెస్ట్ చేశారు. చందాకొచ్చార్ దంపతులతో పాటు వేణుగోపాల్ దూత్ పైన కూడా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద గత ఏడాది జనవరిలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2019 జనవరిలో 22 సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, జనవరి 31న ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. దీంతో చందాకొచ్చార్ను పదవి నుండి తప్పించారు. ఈ కేసులో పలుమార్లు విచారణ జరిపిన ఈడీ ఇప్పుడు దీపక్ను అరెస్ట్ చేసింది.

చందాకొచ్చార్ హయాంలో గుజరాత్లోని స్టెర్లింగ్ బయోటెక్ ఫార్మా కంపెనీ, భూషణ్ స్టీల్ గ్రూప్కు ఐసీఐసీఐ నుండి రుణాలు మంజూరు చేసేందుకు మనీలాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనా ఈడీ దర్యాఫ్తు చేస్తోంది. ఇదిలా ఉండగా, మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది మార్చిలో ఈడీ స్వాధీనం చేసుకున్న తమ ఆస్తుల్ని విడుదల చేయాలని దీపక్ కొచ్చార్కు చెందిన పసిఫిక్ క్యాపిటల్ సర్వీస్ ప్రయివేటు లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆస్తుల సీజ్ ఏడాది మాత్రమే ఉంటుందని, ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేయనందున ఆస్తులను విడుదల చేయాలని కోరింది. దీనిపై ఈడీ ఆభ్యంతరం వ్యక్తం చేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications