Sundar Pichai: టెక్నాలజీ రంగంలో అమెరికా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న మైక్రోసాఫ్ట్, ఉబర్, యాపిల్, టెస్లా, మెటా లాంటి కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కంపెనీలు ఉద్యోగులకు ఊహించని షాక్స్ ఇస్తున్నాయి.

బాంబు లాంటి వార్త..
ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం అందులోనూ ప్రధానంగా US ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే ముందు పెద్ద కంపెనీలు కార్మికులను తొలగిస్తున్నాయి. ఈ వార్తలు రోజూ వింటున్నవే. అయితే తాజాగా ఈరోజు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బాంబు లాంటి వార్తను ప్రకటించారు. ఇప్పటి వరకు ఉద్యోగుల తొలగింపు గురించి ఎలాంటి ప్రకటన చేయని గూగుల్.. రానున్న క్వార్టర్లో ఫలితాలు అంచనాలను చేరుకోకపోతే పరిస్థితులు వేరేవిధంగా ఉంటాని ఉద్యోగులను హెచ్చరించింది.

సీఈవో ఏమన్నారంటే..
ఇటీవల జరిగిన ఒక సదస్సులో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. కంపెనీ ఇప్పుడు ఉన్నదానికంటే 20 శాతం మరింత సమర్థవంతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిని సాధించేందుకు ఉద్యోగులందరూ పూర్తిగా నిమగ్నమై ఉండేలా చూడాలని అన్నారు. ఇందులో భాగంగా అవసరమైనంత మేరకు ఉద్యోగుల తొలగింపు ఉంటుందని హింట్ ఇచ్చారు. కంపెనీ కెపాసిటీని 20 శాతం మేర పెంచలేనిపక్షంలో అనవసర అనవసరపు వర్క్ ఫోర్స్ ను తొలగించనున్నట్లు తెలుస్తోంది.

తగ్గిన ఆదాయాలు..
ఆర్థిక మాంద్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ప్రకటనల కోసం పెద్దగా ఖర్చు చేయకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఎందుకంటే.. Google తన ఆదాయంలో ఎక్కువ భాగం ప్రకటనల రాబడిపై ఆధారపడుతుంటుంది. ఇలాంటి సమయంలో గూగుల్ ఎలా ముందుకు సాగగలదని సుందర్ పిచాయ్ ప్రశ్నించారు. ఉద్యోగుల సంఖ్య తగ్గించినప్పుడు.. మిగిలిన వారు ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యతనిస్తూ వేగంగా పనిచేయవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

వేగం పెంచేందుకు..
చాలా మంది ఉద్యోగులు ఉంటే.. ఒక విషయంపై నిర్ణయం ఆలస్యం అవుతుంది. ఇది ఉద్యోగుల ఉత్పాదకతను, కంపెనీ వృద్ధి రేటును తగ్గిస్తుంది. అవసరమైన చోట తగినంత మంది సిబ్బందిని ఉంచడం ద్వారా ఈ ఆలశ్యాన్ని సరిచేయవచ్చని సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. దీంతో మరికొద్ది వారాల్లో గూగుల్ నుంచి ఉద్యోగుల తొలగింపుపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలా.. మైక్రోసాఫ్ట్, ఉబర్, యాపిల్, టెస్లా, మెటాతో పాటు ఉద్యోగుల తొలగింపు జాబితాలో గూగుల్ చేరే అవకాశం తాజా ప్రకటనతో స్పష్టంగా కనిపిస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications