IT News: ఐటీ రంగాన్ని తీవ్రంగా వేదిస్తున్న సమస్యల్లో ముఖ్యమైనది ఉద్యోగుల జీతాలు. జీతాలు పెంచటం లేదా అంటే.. పెంచుతున్నారు. కానీ.. అందులో చూపుతున్న భారీ వివక్ష గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం గడచిన 10 ఏళ్లుగా ఈ విషయంలో తీరు మార్చుకోలేదని తెలుస్తోంది.

జీతాల పెంపు..
ఐటీ రంగం వృద్ధికి అనుగుణంగా సదరు కంపెనీలు తమ సీఈవోలకు జీతాలను భారీగానే పెంచుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఈ రంగంలోకి వస్తున్న సీఈవోలు, ఫ్రెషర్ల సగటు జీతాల ప్యాకేజీల మధ్య భారీగా వ్యత్యాసం ఉంది. గడచిన 10 ఏళ్ల డేటా విశ్లేషణ ఇదే వెల్లడిస్తోంది. కాల క్రమేణా ఫ్రెషర్ల జీతాలు 46 శాతానికి పైగా పెరగగా.. సీఈవోల జీతాలు మాత్రం ఏకంగా 1,500 శాతం జంప్ అయ్యింది. ఈ విశ్లేషణ పబ్లిక్గా అందుబాటులో ఉన్న సమాచారం నుంచి సేకరించబడింది.

మధ్యస్థ జీతం..
అంతేకాక సీఈవోలకు మధ్యస్థ జీతం పెంపు 1,449.02 శాతంగా ఉండగా.. ఫ్రెషర్లకు మధ్యస్థ జీతం 40 శాతం మాత్రమే ఉందని ఇందులో తేలింది. కంపెనీల్లో హైరార్కీ ప్రకారం సీఈవోల నుంచి పిరమిడ్ దిగువన ఉన్న వారి మధ్య జీతాల విషయంలో వ్యత్యాసం ఎక్కువగానే ఉంది.

ఇన్ఫోసిస్ మాజీ CFO..
ఈ జీతాల విషయంపై ఇన్ఫోసిస్లో మాజీ CFO, బోర్డు సభ్యుడు TV మోహన్దాస్ పాయ్ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఫ్రెషర్లకు చెల్లిస్తున్న పరిహారంలో పెరుగుదల లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 10-12 ఏళ్ల కిందట కంపెనీలు చెల్లిస్తున్న రూ.3.5-4 లక్షల ప్యాకేజీలనే ఇప్పుడూ ఇస్తున్నాయని అన్నారు. ఈ సమయంలో మేనేజర్లు, సీనియర్లకు చెల్లించే జీతాలు మాత్రం 4, 5, 7 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు.

HCL Tech మాజీ సీఈవో..
హెచ్సీఎల్ టెక్ మాజీ సీఈవో వినీత్ నాయర్ కూడా ఫ్రెషర్ల జీతాల విషయంలో ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమైనదని, సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్రను అర్థం చేసుకోవటం అని అన్నారు. కంపెనీలు తమ మార్కెటింగ్ బడ్జెట్లో కొంత భాగాన్ని ఉద్యోగులను ఉత్సాహపరచడం, ప్రోత్సహించడంపై ఖర్చు చేస్తే లాభదాయకత 10 రెట్లు పెరుగుతుందని అన్నారు. కంపెనీలు మ్యానేజ్ మెంట్ ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవటం లేదని అన్నారు.

జీతాల్లో వ్యత్యాసం..
కంపెనీ సీఈవోలు, ఫ్రెషర్ల మధ్య ఉన్న జీతాల వ్యత్యాసం ఇన్ఫోసిస్ విషయంలో 1,973, విప్రో 2,111, HCL టెక్నాలజీస్ 1,020, టెక్ మహీంద్రాలో 644, TCS వద్ద 619 గా ఉందని వెల్లడైంది. ప్రస్తుత గ్రాడ్యుయేట్లు, ఫ్రెషర్లకు పరిశ్రమ వెతుకుతున్న సరైన నైపుణ్యాలు లేకపోవడమే ఈ అసమానతలకు కారణమని నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ కిరణ్ కార్నిక్ పేర్కొన్నారు. తరచుగా వారికి డొమైన్ నైపుణ్యాలు ఉండవు, వారు అందులో శిక్షణ పొందవలసి ఉంటుందని అన్నారు. మెుత్తానికి దశాబ్ధ కాలం గడుస్తున్నా.. ఈ అంతరాతం తగ్గలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications