ముంబై: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోన్న వేళ.. అనేక రాష్ట్రాలు మూడోదశను అమలు చేయడానికి సాహసించట్లేదు. వ్యాక్సిన్ల కొరత రాష్ట్ర ప్రభుత్వాలను వెంటాడుతోంది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు 18 నుంచి 44 సంవత్సరాలలోపు వారికి టీకాలను ఇవ్వట్లేదు. నిన్న, మొన్నటిదాకా దీన్ని అమలు చేసిన ఢిల్లీ ప్రభుత్వం కూడా మూడోవిడత వ్యాక్సినేషన్ను నిలిపివేసింది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన చేశారు.

వ్యాక్సిన్ల కొరత ఎందుకు?
ఇక తెలంగాణ ప్రభుత్వం 45 ఏళ్లకు పైనున్న వయస్సున్న వారికి వేయాల్సిన రెండో డోసు వ్యాక్సిన్ను సైతం నిలిపివేసిందంటే.. దాని షార్టేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్లు దేశంలో నెలకొనడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. తాజాగా- సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ జాదవ్ చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు మరింత ఆజ్యం పోసినట్టయ్యాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ను తయారు చేస్తోన్న సీరమ్ సంస్థ ఈ తరహా కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

స్టాక్ గురించి పట్టించుకోకుండానే..
టీకాల స్టాక్ ఉందో లేదో చూసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిందని సురేష్ జాదవ్ చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించలేకపోయిందని అన్నారు. హీల్ హెల్త్ సంస్థ నిర్వహించిన ఓ సమ్మిట్లో పాల్గొన్న ఆయన దేశంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడటానికి గల కారణాన్ని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా మూడో కోట్ల మంది ఫ్రంట్లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించిందని..దాంతో దానికి తగ్గట్టే ప్రభుత్వానికి రెండు డోసులకు అవసరమయ్యేలా 6 కోట్ల డోసుల వ్యాక్సిన్ సరఫరా చేశామని అన్నారు.

సంప్రదించకుండానే వ్యాక్సిన్ డ్రైవ్..
ఆ తరువాత వ్యాక్సిన్ తయారీ కంపెనీలను సంప్రదించకుండానే రెండోదశను అమలు చేసిందని అన్నారు. రెండోదశ కింద దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న 45 సంవత్సరాలకు పైనున్న వయస్సు వారికి వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. తాము తయారు చేస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి పరిమితమేననే విషయం కేంద్రప్రభుత్వానికి ముందే తెలుసని అన్నారు. అయినప్పటికీ- తమను సంప్రదించకుండా హుటాహుటిన 45 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు.

రెండో డోసు వ్యాక్సిన్లు తొలిడోసుగా..
ఫలితంగా- తయారవుతోన్న వ్యాక్సిన్కు, సరఫరా అవుతోన్న వ్యాక్సిన్ మధ్య అవాంఛనీయ జాప్యం చోటు చేసుకుందని వివరించారు. రెండో డోసుగా ఇవ్వడానికి నిల్వ ఉంచుకున్న వ్యాక్సిన్లను కూడా తొలి డోసుగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించలేకపోవడమే కారణమని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యాక్సిన్ల కొరత ఓ గుణపాఠం లాంటిదని సురేష్ జాదవ్ వ్యాఖ్యానించారు. ఉత్పత్తి సామర్ధ్యం, నిల్వల ఆధారంగా వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు చెబుతున్నాయని, వాటిని కూడా కేంద్రం అనుసరించలేదని చెప్పారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications