Big Update: దేశంలో అమలవుతున్న దాదాపు అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి గుర్తింపు కార్డుగా మారింది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు ఆధార్ కార్డుకు లింక్ అయితేనే ప్రభుత్వం నుంచి వచ్చే నగదు సాయం నేరుగా అందుకునే అవకాశం ఉంది. దీంతో ఆధార్ ప్రాముఖ్యత పెరుగుతూ వస్తోంది.
ఇదే సమయంలో ప్రస్తుతం దేశంలో అత్యంత సులభంగా మార్చుకోగలిగిన ఓ గుర్తింపు పత్రం ఆధార్ కార్డు. అయితే త్వరలో ఇది అత్యంత కఠినతరం కానుంది. దాదాపు పాస్ పోర్ట్ స్థాయిలో వెరిఫికేషన్ జరగవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది.

ఆధార్ కార్డు కోసం ఓ కొత్త విధానాన్ని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి గురించి రాష్ట్ర ప్రభుత్వం వాకబు చేయనుంది. ఇది పాస్పోర్ట్ వెరిఫికేషన్ తరహాలో ఉంటుంది. SDM స్థాయి అధికారి ఆమోదం పొందిన తర్వాతే కొత్త ఆధార్ కార్డు జారీ చేయబడుతుంది. ఉత్తరప్రదేశ్లో ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
కొత్త విధానంలో దరఖాస్తుదారుని భౌతిక ధృవీకరణ కోసం జిల్లా స్థాయిలో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ మరియు సబ్-డివిజన్ స్థాయిలో SDM ను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఈ అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే కార్డులు జారీ చేయబడతాయి. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ప్రత్యేకంగా జిల్లా హెడ్ పోస్టాఫీసులు సహా కొన్ని ఆధార్ కేంద్రాలను ఎంపిక చేస్తారు.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) కొత్త సూచనల ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతకు మాత్రమే ఈ ప్రక్రియ వర్తిస్తుంది. అయితే ఒకసారి ఆధార్ రెడీ అయిన తర్వాత సాధారణ ప్రక్రియ ప్రకారం అన్ని రకాల అప్డేట్లను చేసుకోవచ్చు. ఇప్పటికే కార్డులు ఉన్నవారికి ఈ కొత్త విధానం వర్తించదు. అంటే ఇకపై కొత్తగా ఆధార్ పొందేందుకు గరిష్ఠంగా 180 రోజులు పట్టవచ్చు. ఫిజికల్ వెరిఫికేషన్ సమయంలో దరఖాస్తుదారు అక్కడ ఉండటం తప్పనిసరి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?



Click it and Unblock the Notifications