DA hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 5వ పే కమీషన్ ప్రకారం జీతాలు పొందుతున్న కేంద్ర ప్రభుత్వ మరియు కేంద్ర అటానమస్ బాడీల ఉద్యోగులకు 16 శాతం కరువు భత్యం(DA) ఇవ్వడానికి నిర్ణయించింది. తద్వారా మునుపటి DA రేటు బేసిక్ పేలో 396 శాతం కాగా.. తాజా పెంపు తర్వాత ఇది 412 శాతానికి చేరనుంది. సవరించిన DA రేటు జనవరి 1, 2023 నుండి వర్తిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పంపిన ఆఫీస్ మెమోరాండంలో ఈ మేరకు వెల్లడించింది.
6వ సెంట్రల్ పే కమీషన్ కింద సవరించిన పే స్కేల్/గ్రేడ్ పే ప్రకారం వేతనాన్ని పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఈ బెనిఫిట్ అందుకున్నారు. ఏప్రిల్ 2023లో వీరికి DA రేటును 212 నుంచి 221 శాతానికి పెరిగింది. కాగా ఇప్పుడు 5వ పే కమీషన్ కింద ఉన్న వేతన జీవుల DA పెంపునకు ఆర్థిక శాఖ నిర్ణయించింది.

ఇక 7వ పే కమీషన్ ప్రకారం జీతం పొందుతున్న కేంద్ర ఉద్యోగులకు చెల్లించాల్సిన డియర్నెస్ అలవెన్స్ పైనా ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది. 1 జనవరి 2023 నుంచి బేసిక్ పేలో DAను 38 నుంచి 42 శాతానికి పెంచింది. ఈ పెంపు గురించి ఏప్రిల్ 2023లోనే ప్రభుత్వం ప్రకటించింది. ఇదే పే స్కేల్లో పెన్షన్ పొందుతున్న వారికి సైతం DR రేటును 38 నుంచి 42 శాతానికి హెచ్చించింది.
ఇదిలా ఉండగా, జూలైలో మరో కరవు భత్యం పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ దఫా DA హైక్ 42 నుంచి 45 శాతానికి పెంచవచ్చని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి..
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications