dividend: దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని మోడీ సర్కారు భావిస్తోంది. అందుకోసం వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వాటిలో ముఖ్యమైనవి. ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థికానికి మూల స్తంభాలని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే, వాటిని బంగారు బాతు అని చెప్పడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డివిడెండ్ రూపంలో ఈ కంపెనీల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంచనాలు మించి ఉన్నాయి.

మరోసారి అంచనాలు మించి:
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సర్కారుకు సమకూరే ఆదాయం మరోసారి రూ.50 వేల కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. సవరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాదికి గాను రూ.43 వేల కోట్లు పొందవచ్చని ప్రభుత్వం భావించింది. అయితే ఇంధనం, విద్యుత్, కమొడిటీ విభాగంలో మంచి వృద్ధి నమోదు కావడంతో.. సంబంధిత సంస్థల నుంచి పెద్ద ఎత్తున డివిడెండ్ చెల్లింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

గతేడాది 28 శాతం అధికం:
కోల్ ఇండియా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC), NHPC, పవర్ గ్రిడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, NMDCల నుంచి.. ఫిబ్రవరి మరియు మార్చిలో భారీగా డివిడెండ్ రాబడి పొందే అవకాశం ఉందని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. ఇంధనం, కమొడిటీ ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున ఆదాయం సాధించాయన్నారు. FY22 ఆర్థిక సంవత్సరంలో CPSEల నుంచి కేంద్రం రూ.59 కోట్ల డివిడెండ్లను పొందింది. ముందస్తు అంచనా రూ.46 వేల కోట్ల లక్ష్యం కంటే ఇది 28 శాతం ఎక్కువ కావడం విశేషం.

ONGC, కోల్ ఇండియాల హవా:
దేశీయ క్రూడ్ ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్నులు ఉన్నా, గత త్రైమాసికంలో ONGC నికర లాభం సంవత్సరానికి 26 శాతం పెరిగింది. తద్వారా ఆదాయం 11 వేల కోట్లను దాటింది. అందువల్ల మార్చి 16 నాటికి ONGC తరఫున అదనపు డివిడెండ్ గా రూ.2,960 కోట్లు ప్రభుత్వానికి చేరనున్నాయి. దీనితో FY23కి గాను సవరించిన అంచనాలు అందుకున్నట్లే. ఇదే ఏడాదిలో ఇప్పటివరకు డివిడెండ్ల రూపంలో మొత్తం ONGC రూ.7,409 కోట్లు చెల్లించింది.
Q3FY23లో కోల్ ఇండియా లాభం 69 శాతం వృద్దిని సాధించి ఏడాదిలో రూ.7,719 కోట్లకు చేరింది. త్వరలోనే రూ.2,240 కోట్ల డివిడెండ్ ను చెల్లించనుంది. FY23లో మొత్తం రూ.7,336 కోట్లు డివిడెండ్ చెల్లింపులు చేసింది. ఇవిగాక NTPC నుంచి సైతం రూ.2,100 కేంద్రానికి రానున్నాయి.

బఫర్ గా పనికొస్తాయి:
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.50 వేల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. FY23లో ఇప్పటివరకు
రూ.31,106 కోట్లు సాధించింది. పూర్తిగా లక్ష్యాన్ని చేరుకోలేని పక్షంలో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వస్తున్న అధిక డివిడెండ్ లు బఫర్ గా పని చేస్తాయని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. RBI మిగులు రాబడిలోనూ సుమారు రూ.30 వేల కోట్లు లోటు ఏర్పడింది. దీనితో సవరించిన అంచనాల ప్రకారం.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రావాల్సిన డివిడెండ్ ను 45 శాతం తగ్గించి రూ.40,953 కోట్లు మాత్రమే స్వీకరించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications