adani issue: అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణల వల్ల అదానీ గ్రూపు కంపెనీలు కోట్లాది రూపాయల మేర నష్టపోయాయి. సంస్థతో పాటు భారత్ పేరు, ప్రఖ్యాతులు సైతం దెబ్బతిన్నాయని దేశంలోని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు పార్లమెంటు సమావేశాలను స్తంభింప చేస్తున్నారు. ఈ కుంభకోణంపై చర్చ జరిగి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు విషయం రాజకీయ రంగు పులుముకోవడంతో పార్లమెంటులో గందరగోళ పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రులు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఏమాత్రం వినిపించుకోవడం లేదు.

మార్కెట్ రెగ్యులేటర్లు సిద్ధం:
అదానీ కంపెనీల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. మన ఆర్థిక మార్కెట్లు ప్రపంచంలోనే అత్యంక గౌరవనీయమైనవని, అత్యద్భుతంగా నియంత్రించబడేవన్నారు. ఆయా సంస్థల మీద వచ్చిన ఆరోపణలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునే సమర్థత వాటికి ఉందన్నారు.

ప్రజాధనం సేఫ్:
దాదాపు 100 బిలియన్ డాలర్ల మేర జరిగిన నష్టంపై చర్చ నిర్వహించకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అయితే స్టాక్ మార్కెట్ లోని పెట్టుబడులు హెచ్చుతగ్గులకు గురవుతాయని, ఇది సర్వసాధారణమని గోయల్ తెలిపారు. ప్రజాధనానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదని, తమ ఖాతాదారుల సొమ్ము పూర్తిగా భద్రమని ఇప్పటికే ఆర్థిక సంస్థలు స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. ఎక్కువగా నష్టపోయాయని ప్రచారం జరుగుతున్న LIC, SBIలు సైతం స్పందించాయన్నారు.

నేను హామీ ఇస్తున్నా..
"ఇది ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన విషయమని నేను భావిస్తున్నాను. విదేశీ ఏజెన్సీ విడుదల చేసిన నివేదిక ఆధారంగా ఆరోపణలు వచ్చాయి. మార్కెట్ రెగ్యులేటర్లు తగిన చర్యలు తీసుకుంటారు" అని మంత్రి పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ప్రపంచంలో ఎవరూ, ఎటువంటి హామీలను ఇవ్వరన్నారు. కానీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిరంతరం పరిస్థితిని గమనిస్తూ ఉంటాయని.. నియంత్రణ సంస్థల సమర్థతపై తాను హామీ ఇస్తున్నట్లు చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications