Crackdown on Loan Apps: దేశంలో ఫేక్ లోన్ యాప్స్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చాలా మంది అమాయకులు వీరి చేతిలో చిక్కి చివరికి వారి ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్న కేసులు నిత్యకృత్యంగా మారాయి. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సైతం దీనిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం చాలా సీరియస్గా పరిగణిస్తోంది. అన్ఆర్గనైజ్డ్ రుణాలను నిషేధించడంతో పాటు చట్టాలను ఉల్లంఘించిన వారిపై రూ.కోటి జరిమానాతో పాటు 10 ఏళ్లు జైలు శిక్ష విధించే లక్ష్యంతో ఒక చట్టం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గడచిన రెండేళ్ల కాలంలో క్రమబద్ధీకరించబడని రుణ విధానాల్లో నిమగ్నమైన వివిధ డిజిటల్ లోన్ యాప్లపై అణిచివేత, వారి అనైతిక రుణ విధానాలు.. దూకుడు రికవరీ పద్ధతుల గురించి అనేక ఫిర్యాదులు వస్తున్న వేళ కేంద్రం కొత్త చట్టంతో ముందుకొస్తోంది. దీనిపై ఫిబ్రవరి 2025 వరకు ప్రజాభిప్రాయాలను సేకరించటానికి అందుబాటులో ఉంచింది.

బ్యానింగ్ ఆన్ అన్ఆర్గనైజ్డ్ లెండింగ్ యాక్టివిటీస్ పేరుతో చట్టాన్ని తీసుకొస్తోంది. ఆర్థిక సంస్థలు తమ రుణ వ్యాపారాన్ని కొనసాగించటానికి ముందు రిజర్వు బ్యాంక్ లేదా సంబంధిత రెగ్యులేటరీ ఏజెన్సీల నుంచి ముందుగా అనుమతులు పొందాల్సిన అవసరం ఉంది. ముసాయిదా బిల్లు ప్రకారం బంధువులకు రుణాలు ఇవ్వడం మినహా, రుణగ్రహీతల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం క్రమబద్ధీకరించని రుణ కార్యకలాపాలను నిషేధించడానికి ఒక సమగ్ర యంత్రాంగాన్ని అందించడానికి ఒక చట్టం తీసుకొస్తున్నట్లు పేర్కొంది.
ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. పబ్లిక్ లెండింగ్ యాక్టివిటీ అనేది వ్యక్తులు నిర్వహించే ఫైనాన్సింగ్ వ్యాపారాన్ని సూచిస్తుంది. ఇందులో నగదు లేదా వస్తు రూపంలో వడ్డీ రేట్ల వద్ద బంధువులు కాని వారికి రుణాలు లేదా అడ్వాన్స్లు చేయడం వంటివి ఉంటాయని పేర్కొంది. కేవలం బంధువులకు ఇచ్చే రుణాలను మాత్రమే ఈ నిర్వచనం నుంచి మినహాయించింది కేంద్రం. అనధికారికంగా రుణాలు ఇచ్చే విధానాలపై 7 వరకు జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల నుంచి రూ.కోటి వరకు జరిమానా విధించబడతాయని ముసాయిదా పేర్కొంది. అలాగే రుణాల చెల్లింపుల్లో బలవంతపు వసూళ్లు వంచి పద్ధతులను ఫాలో అయ్యే సంస్థలకు 3 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు కఠినమైన జరిమానాలు ఉంచాయని స్పష్టం చేసింది.
దేశంలో అనధికారిక లోన్ లెడింగ్ యాప్స్ విషయంలో గూగుల్ యాప్ స్టోర్ సైతం సెప్టెంబర్ 2022 నుంచి ఆగస్టు 2023 వరకు ఆసక్తికరమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఏకంగా యాప్ స్టోర్ నుంచి 2,200 కంటే ఎక్కువ యాప్స్ ను తొలగించింది. దీనికి ముందు ప్రభుత్వం ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు మరియు సోషల్ మీడియా కంపెనీలను అటువంటి ఆర్థిక సేవల ప్రకటనలను మానుకోవాలని కోరుతూ మార్గదర్శకాలను జారీ చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications