GST: జీఎస్టీ బేస్ పెంచేందుకు కేంద్రం పెద్ద కసరత్తే చేస్తోంది. ఇందుకోసం కరెంటు బిల్లులు, ఆస్తిపన్ను డేటాను వినియోగించుకోవాలని చూస్తోంది. జీఎస్టీ కింద మరింత ఆదాయాన్ని సేకరించటంలో భాగంగా జీఎస్టీకి సంబంధించి బోర్డు ఈ వ్యూహాన్ని తెరమీదకు తెచ్చింది.

జీఎస్టీ ఆరంభంలో..
దేశంలో జీఎస్టీని తొలుత అమలులోకి తెచ్చినప్పుడు రూ.45-50 లక్షల జీఎస్టీ పన్ను బేస్ ఉండేదని CBIC చైర్మన్ వివేక్ జోహ్రి తెలిపారు. అయితే ఇప్పుడు దానిని రూ.1.4 కోట్లకు పెంచినట్లు ఆయన వెల్లడించారు.కానీ ప్రస్తుత సమయంలో పన్ను బేస్ మరింతగా పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎలక్ట్రిక్ మీటర్ల డేటా..
జీఎస్టీ బేస్ పెంపుకు తాము క్రమంగా శాస్త్రీయ పద్ధతిలో ముందుకెలతామని జోహ్రీ వెల్లడించారు. దీనికోసం దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి ఎలక్ట్రిక్ మీటర్ల డేటాను సేకరిస్తామని తెలిపారు. అలాగే ఆస్తి పన్ను డేటాను కూడా ఉపయోగించుకోనున్నట్లు వెల్లడించారు. పన్ను ఆదాయాన్ని పెంచటమే లక్ష్యంగా జీఎస్టీ బోర్డు ముందుకు సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. సేకరించిన సమాచారాన్ని డేటా అనలటిక్స్ ద్వారా జల్లెడపడతామని స్పష్టం చేశారు.

తక్కువగా టాక్స్ పేయర్స్..
తమ పరిశీలన ప్రకారం జీఎస్టీ చెల్లించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని జోహ్రీ తెలిపారు. ఇటీవల కేంద్రం బడ్జెట్ 2023 సమావేశాల్లో పాన్ కార్డును దేశంలో ఉమ్మడి వ్యాపార ఐడెంటిటీగా ప్రకటించినందున ఆ డేటాను తాము జీఎస్టీ వసూళ్ల పెంపుకు వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా పన్ను చెల్లించదగిన వారిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.

బిల్లింగ్ లేకుండా వ్యాపారం..
ప్రస్తుతం దేశంలో వ్యాపారులు కస్టమర్లకు బిల్ ఇవ్వకుండానే వస్తువులను, ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అయితే రోజువారీ లక్షల్లో వ్యాపారాలు నిర్వహించే ఇలాంటి వారు బిల్స్ లేకుండా వ్యాపారాలను కొనసాగించటం వల్ల జీఎస్టీ పరిధి నుంచి తప్పించుకుంటున్నారని.. ఈ సమస్యకు సైతం త్వరలోనే పరిష్కారాన్ని కనుగొంటామని ఆయన వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లలో ఇలాంటి నష్టాలను అధిగమించటానికి పరిష్కారాలతో వస్తామన్నారు. ఇలాంటి వాటి నుంచి టాక్స్ చెల్లింపుదారులను, వినియోగదారులను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, టాక్స్ డిపార్ట్ మెంట్ ప్రకటనలు కూడా ఇస్తోందని అన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications