Banking News: బ్యాంకుల ప్రైవేటీకరణపై మోదీ 3.0 దారెటు? ముందుకా.. వెనక్కా?

PSBs Privatization: ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను ప్రైవేటీకరించాలని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. కాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి BJP అధికారంలోకి వచ్చింది. కాగా దీనిపై వెనక్కి తగ్గవచ్చినే విశ్లేషణలు ఉన్నాయి. ఈ విషయంపై RBI మాజీ అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ విషయంలో 2024-25లో కొంత పురోగతిని సాధించవచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి. 'గత కొన్నేళ్లుగా IDBI బ్యాంక్ వాటాల విక్రయం జరగడం చూశాం. ఈ ఏడాది ఇతర బ్యాంకుల ప్రైవేటీకరణ కూడా జరగవచ్చు. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉండగా.. ఇప్పుడు ముందుకు సాగుతుందని భావిస్తున్నాం' అని RBI మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ సిన్హా తెలిపారు.

Center way on PSBs privatization

ప్రైవేటీకరణ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతుండగా, ప్రభుత్వం దీని గురించి పునరాలోచించవచ్చని PSBలకు సంబంధించిన ఓ ఎగ్జిక్యూటివ్ స్పష్టం చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఎన్నికల కారణంగా ప్రక్రియ నిలిచిపోయిందని, త్వరలోనే తిరిగి వాటిపై దృష్టి సారిస్తుందని వెల్లడించారు.

2022లో బడ్జెట్ సమర్పణ సమయంలో 1.75 లక్షల కోట్లను సమీకరించేందుకు పెట్టబడుల ఉపసంహరణ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కాగా గత నెలలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఇదే విషయంపై కీలక కామెంట్స్ చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+