adani: అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలు సుప్రీం కోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. పిటిషన్ దారులు కోరుతున్న అంశాలపై కేంద్రం, మార్కెట్ నియంత్రణ సంస్థలు ఏమనుకుంటున్నాయో చెప్పాలని ఉన్నత న్యాయస్థానం గత శుక్రవారం ఆదేశించింది. ఈ పిల్ పై ఈరోజు మరోసారి విచారణ జరిగింది. కోర్టు సూచనల పట్ల కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు సొలిసిటర్ జనరల్ వెల్లడించారు.

కమిటీకి కేంద్రం ఓకే:
స్టాక్ మార్కెట్ లో అదానీ ఉదంతం తరహా అస్థిరతలను నివారించడానికి ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ విషయంలో తమకేమీ అభ్యంతరం లేదని ఈరోజు వెల్లడించింది. కొన్ని పేర్లను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. నియంత్రణ సంస్థల సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని మరోసారి స్పష్టం చేశారు.

ఈనెల 17కు వాయిదా:
మారుతున్న ఆర్థిక పరిస్థితులు, పన్ను విధానాల వల్ల స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరిగుతోందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అదానీ వ్యవహారం కారణంగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనానికి నష్టం ఏర్పడినట్లు కొన్ని నివేదికలు వెలువడినట్లు గుర్తు చేసింది. భవిష్యత్తులో ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా ఓ నిర్ధిష్ట విధానం రూపకల్పనకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని.. కేంద్రం, నియంత్రణ సంస్థలకు న్యాయస్థానం సూచించింది. కోర్టు సలహాను పాటించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తరఫున SG తెలిపారు. కాగా.. విచారణను ఫిబ్రవరి 17కు ధర్మాసనం వాయిదా వేసింది.

బీమా సంస్థల ఎక్స్ పోజర్:
ప్రభుత్వ రంగ బీమా సంస్థలు అదానీ గ్రూప్ కంపెనీల్లో రూ.348 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఈరోజు ప్రకటించింది. వాటి మొత్తం నిర్వహణలోని ఆస్తి(AUM)లో ఇది 0.14 శాతమని వెల్లడించింది. బీమా దిగ్గజం LIC మొత్తం AUMలో 0.975 శాతం(దాదాపు 36 వేల కోట్లు) ఎక్స్ పోజర్ను కలిగి ఉన్నట్లు తెలిపింది.

పార్లమెంటులో ఆర్థిక శాఖ ప్రకటన:
న్యూ ఇండియా, యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలన్నీ కలిపి రూ.348 కోట్లు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు పార్లమెంటుకు ఆర్థిక శాఖ తెలిపింది. ఎగ్జిమ్ బ్యాంక్, SIDBI, NHB, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (NBFID), NABARD వంటి సంస్థలు చట్ట ప్రకారం సమాచారాన్ని బయటకు వెల్లడించలేవని పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications