Celebrity Betting Scam: టాలీవుడ్లో భారీ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం రేపుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన పెద్ద స్కాంలో ఒకటైన బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ప్రారంభించింది. ప్రముఖ తెలుగు నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యాంకర్లు శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి తదితరులపై ఈడీ కేసు నమోదు చేసింది.
హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును ప్రారంభించింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇప్పుడు మనీలాండరింగ్ చట్టాల కింద విచారణను ఎదుర్కొననున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లలో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత తదితరుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చారు.

పోలీసులు ఇప్పటికే 19 మంది యాప్ యజమానులపై కేసు నమోదు చేశారు.విచారణకు గురైన యాప్లలో జంగిల్ రమ్మి డాట్ కామ్, ఏ23, యోలో 247, ఫెయిర్ ప్లే, జీత్ విన్, విబుక్, తాజ్ 77, వివి బుక్, ధని బుక్ 365, మామ 247, తెలుగు 365, ఎస్365, జై365, జెట్ ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777బుక్, ఆంధ్ర365 ఉన్నాయి. ఈ కేసు భారతీయ న్యాయసంహిత సెక్షన్లు 318(4), 112, రెడ్విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3, 3(ఎ), 4, అలాగే ఐటీ చట్టం 2000, 2008 సెక్షన్ 66డి కింద నమోదు చేశారు. ఈడీ ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటీసులు పంపించి స్టేట్మెంట్లు రికార్డ్ చేయడానికి సిద్ధమవుతోంది. విచారణ మరింత ముమ్మరంగా సాగే అవకాశముంది.
గతంలో నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి టీమ్స్ దీనిపై స్పష్టత ఇచ్చారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు వారు ఎప్పుడూ ప్రచారం చేయలేదని, చట్టబద్ధమైన అనుమతులు ఉన్న నైపుణ్యాధారిత గేమింగ్ యాప్లకు మాత్రమే ప్రచారం చేశామని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ తన టీమ్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో "ఏ23" అనే యాప్తో చేసిన ప్రచార ఒప్పందం ఇప్పటికే ముగిసిపోయిందని, ప్రస్తుతం ఆ యాప్తో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
ఇదే తరహాలో రానా దగ్గుబాటి టీమ్ కూడా స్పందిస్తూ, రానా ఒప్పందం 2017లోనే పూర్తయ్యిందని వెల్లడించారు. చట్టపరమైన అనుమతులు ఉన్న యాప్లకు మాత్రమే తాము ప్రచారం చేశామని, నిషేధిత బెట్టింగ్ యాప్లకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. 2016లో తాను కుదుర్చుకున్న ఒప్పందం అప్పుడే ముగిసిందని, ప్రస్తుతం ఎలాంటి ప్రమోషన్లలో భాగం కావడం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఈ కేసులో పలువురు సినీ నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు హైదరాబాద్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ యాప్ల కారణంగా అప్పులపాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇదే విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications