Misleading Ads: పిల్లలను లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగా.. ఒక ప్రొడక్ట్ కొనుగోలుపై, మరొక ఉత్పత్తిని ఉచితంగా ఇచ్చే ప్రకటనలను నిషేధించింది. ప్రకటనలో ఆరోగ్యానికి సంబంధించిన తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే.. ఇకపై సదరు కంపెనీలతో పాటు, ప్రకటనలో కనిపించే నటుడిపై కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి. మొదటి సందర్భంలో.. రెండు పార్టీలకు రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. దీనితో పాటు ప్రకటనలు చేసే వారిపై మూడేళ్ల నిషేధం కూడా విధించవచ్చు. ప్రకటనల ద్వారా తప్పుడు వాగ్దానాలు చేయటం, ప్రజలను అడ్వటైజ్మెంట్ ద్వారా ఫూల్స్ చేస్తున్నారా అనే అంశాలను పర్యవేక్షించనున్నట్లు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తన తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
తప్పుడు ప్రకటనలు హక్కుల ఉల్లంఘనే..
తప్పుదోవ పట్టింటే ప్రకటనలు చేయటం వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తాయి. అంటే సమాచారం పొందే హక్కు, ఎంచుకునే హక్కు, సేఫ్ కాని ఉత్పత్తులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కులను తప్పుడు ప్రకటనలు భంగం కలిగిస్తాయి. అత్యాశతో ఉత్పత్తులను కొనుగోలు చేయింటే పద్ధతులను నిషేధించాలనే నిబంధన ఉండటం ఇందులో కీలకమని చెప్పుకోవాలి. అలాగే.. హెల్త్ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి ఇకపై ఏ ప్రొఫెషనల్ని అనుమతించరు.

సెలబ్రిటీలకు కఠినమైన నియమాలు..
తప్పుదోవ పట్టించటం లేదా తప్పుడు క్లెయిమ్లు చేసే ప్రకటనలను అరికట్టడానికి జారీ చేసిన మార్గదర్శకాల్లో.. ప్రొడక్టులను ప్రచారం చేసే ప్రచారకర్తలకు లేదా సెలబ్రిటీలకు కఠినమైన నియమాలను తీసుకొచ్చింది. ఒక సెలబ్రిటీ ఏదైనా ఒక వస్తువును ప్రచారం చేసినా, దాని ప్రయోజనాలను తెలిపినా.. ముందుగా తాను చెబుతున్న బెనిఫిట్ వచ్చిందో లేదో చూసుకోవాలి. అదే విధంగా.. ఉత్పత్తిని తయారు చేసే కంపెనీలో సెలబ్రిటీకి ఏదైనా వాటా ఉన్నట్లయితే.. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తప్పకుండా ఇవ్వాలి. వీటికి తోడు పిల్లల సున్నితత్వం, అభద్రతలను దృష్టిలో ఉంచుకుని.. వారి కోసం చేసే ప్రకటనలు వారి మనస్సును తీవ్రంగా ప్రభావితం చేయకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త నియమాలను దేశంలో ఇకపై అమలు చేయబోతోంది. వినియోగదారుల రక్షణను దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలను ఫ్రేమ్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications