భారత ప్రభుత్వం పేదలకు అండగా ఉండేందుకు ఉచిత రేషన్ పథకం నడుపుతోంది. నిజంగా అవసరం ఉన్న కుటుంబాలు ఈ పథకం వల్ల రెండు పూటల భోజనం జోలికి తక్కువ ఖర్చుతో చేరుతున్నాయి. కానీ కొందరు మంచి జీతాలు తీసుకుంటూ, లక్షల్లో సంపాదిస్తూ కూడా రేషన్ కార్డు మోసం చేసి ఉచిత సరుకులు తెచ్చుకుంటున్నారు. అర్హత లేకుండా ప్రభుత్వ రేషన్ తీసుకుంటే, వారికి జరిమానా, శిక్ష రెండూ పడే అవకాశం ఉంది.

ఎవరు రేషన్కు అర్హులు కాదు?
ప్రభుత్వం ఈ ఉచిత రేషన్ పథకానికి కొన్ని క్లియర్ రూల్స్ పెట్టింది. మొదటగా, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కాదు. ఎందుకంటే వాళ్లకు ప్రతి నెలా స్థిరమైన జీతం వస్తోంది కాబట్టి, రేషన్ కోసం డిపెండవ్వాల్సిన పరిస్థితి ఉండదు. అలాగే కారు (ఫోర్-వీలర్) ఉన్నవారు కూడా ఈ లిస్ట్లో లేరు. ఎందుకంటే ఒకవేళ మీరు కారు కొనగలిగితే, అర్ధం మీరు ఆర్థికంగా బాగానే ఉన్నట్టే. ఇక ఇంకమ్ ట్యాక్స్ (IT) చెల్లించే వారు కూడా ఉచిత రేషన్ తీసుకోలేరు. ఎందుకంటే మీ ఆదాయం అంత స్థాయిలో ఉంటే, మీరు 'పేద' కేటగిరీలోకి రారు.
ఎవరికైతే డైలీ బేసిక్ అవసరాలు తీర్చుకోవడానికి నిజంగానే ఇబ్బంది పడుతున్నారో వాళ్లకే ఈ పథకం. మిగతావాళ్లు అర్హత లేకుండా తీసుకుంటే, అది తప్పే కాకుండా పేదల హక్కు కూడా దోచుకోవడమే అవుతుంది. ఇవాళ్టి మార్కెట్లో జీవితం సౌకర్యవంతంగా సాగించగలిగే వాళ్లకు ఈ పథకం అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది.
మోసం చేస్తే ఏం జరుగుతుంది?
తప్పుడు డాక్యుమెంట్లు చూపించి లేదా తప్పుడు సమాచారం ఇచ్చి రేషన్ తెచ్చుకుంటే అది నేరం. మీరు తీసుకున్న ప్రతి కిలో బియ్యం, గింజకు గవర్నమెంట్ లెక్క తీసుకుంటుంది. పట్టుబడితే, ఇప్పటివరకు తీసుకున్న మొత్తం విలువను తిరిగి చెల్లించాలి. దానితో ఆగిపోదు-పెద్ద జరిమానా కూడా పడొచ్చు. కొన్ని కేసుల్లో జైలుకీ వెళ్లే పరిస్థితి వస్తుంది.
రేషన్ దొంగతనం అంటే కేవలం ప్రభుత్వానికి నష్టం జరిగిందనే అనుకోవడం తప్పు. అసలు నష్టం మనందరికీ జరుగుతుంది. ఒకవైపు నిజంగా పేదలకు రావాల్సిన సరుకులు తగ్గిపోతాయి. మరోవైపు ప్రభుత్వ ఖజానాపై భారమవుతుంది. ఈ పథకం నడవడానికి కావాల్సిన డబ్బు మనం చెల్లించే పన్నుల నుంచే వస్తోంది. కాబట్టి ఎవరో రేషన్లో మోసం చేస్తే, లాభం వాళ్లకే కానీ నష్టం మాత్రం పేదలకూ, టాక్స్ చెల్లించే మనందరికీ అవుతుంది.
అక్రమంగా రేషన్ తీసుకుంటే ఏమవుతుంది?
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం, పేద కుటుంబాలకు తక్కువ ధరలకు రేషన్ ఇస్తారు. కానీ ఎవరైనా తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చి లేదా తప్పుడు సమాచారం ఇచ్చి రేషన్ తీసుకుంటే, అది నేరంగా పరిగణిస్తారు.
ఎంత ఫైన్ పడుతుంది?
ఇలాంటి సందర్భాల్లో దొరికితే, మీరు ఇప్పటివరకు తీసుకున్న రేషన్ మొత్తం విలువను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. అదేకాకుండా, మీపై పెద్ద మొత్తంలో జరిమానా విధించబడవచ్చు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది.
కాబట్టి తప్పుడు పద్ధతిలో రేషన్ తీసుకోవడం కేవలం మీ జేబుకే గండికాదు, జైలుకూ తీసుకెళ్లే అవకాశం ఉంది. మీ ఆదాయం బాగానే ఉంటే, రేషన్ కోసం లైన్లో నిలబడటానికి బదులుగా, నిజంగా అవసరమైన వారికి దారి ఇవ్వడం మంచిది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications