Go First: ఆర్థిక ఇబ్బందులతో సేవలు తాత్కాలికంగా నిలిపివేసిన గోఫస్ట్ విమానయాన సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నెల జీతాలను తప్పకుండా చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
కంపెనీ వీలైనంత త్వరగా తన సేవలను తిరిగి ప్రారంభించేందుకు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. కార్యకలాపాలను ప్రారంభించటానికి ముందరే నిలిచిపోయిన జీతాన్ని పూర్తిగా చెల్లిస్తామని యాజమాన్యం వెల్లడించింది. అలాగే వచ్చే నెల నుంచి ప్రతి నెలా మొదటి వారంలో జీతం అందజేస్తామని కెప్టెన్ రజిత్ రంజన్ తెలిపారు.

ఎయిర్క్రాఫ్ట్ లీజర్లు లేవనెత్తిన అభ్యంతరాలు ఉన్నప్పటికీ దివాలా పిటిషన్ను NCLT అంగీకరించిన సంగతి తెలిసిందే. గో ఫస్ట్ దాని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని చూస్తోందని రంజన్ ఉద్యోగులకు ఈ-మెయిల్లో తెలిపారు. మే 2న సేవలను నిలిపివేసిన కంపెనీ అందుకు విమాన ఇంజన్ తయారీదారు ప్రాట్ అండ్ విట్నీ కారణమంటూ నిందించింది.
విమానాలను నిలుపుకోడానికి, కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి తమకు NCLT అనుమతి ఉందని కంపెనీ యాజమాన్యం వెల్లడిస్తూనే.. భారత విమానయాన చరిత్రలో ఇదొక మైలురాయి నిర్ణయమని తెలిపారు. భారత ప్రభుత్వం సహాయకారిగా ఉన్నందున వీలైనంత త్వరగా వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభించమని తమను కోరినట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో కంపెనీ సేనలను తిరిగి ప్రారంభించటానికి ఎంత మేరకు సంసిద్ధంగా ఉందనే విషయాన్ని పరిశీలించేందుకు డీజీసీఏ ఆడిడ్ నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే గోఫస్ట్ ప్యాసింజర్లు తమ విమాన టిక్కెట్లను ఆగస్టు 8 లోపు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications