Adani News: అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ చేసిన తీవ్రమైన ఆరోపణల నుంచి ఇటీవలే గౌతమ్ అదానీ గ్రూప్ తేరుకుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించేందుకు గౌతమ్ అదానీ అనేక అప్పులను గడువు కంటే చాలా ముందరే చెల్లించారు.
అయితే ఇప్పుడున్న సవాలు ఏంటంటే తన వ్యాపారాల మూలధన అవసరాల కోసం గౌతమ్ అదానీ ఇప్పుడు పెట్టుబడిదారులను, రుణదాతలను ఎలా ఆకర్షిస్తారనేది వేచిచూడాల్సిన అంశంగా ఉంది. ఈ క్రమంలో అదానీ సామ్రాజ్యంలోని పవర్ బిజినెస్ నిధుల ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. మరోపక్క 2024 ప్రారంభంలో జాతీయ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన మోడీకి, తన దేశ నిర్మాణ ఎజెండాలో మౌలిక సదుపాయాలను ప్రధాన అంశంగా ఉన్నందున ఇది కీలకమైన అంశం కూడా.

ఇదే సమయంలో తంతే బూరెల బుట్టలో పడ్డట్లు విదేశీ పెట్టుబడులు అదానీ గ్రూప్ కంపెనీల్లోకి వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది. హిండెన్ బర్గ్ ఆరోపణల సమయంలో అమెరికాకు చెందిన GQG పార్టనర్స్ అదానీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. అలా మార్చిలో నెలలో రాజీవ్ జైన్-నియంత్రిత GQG భాగస్వాములు ప్రారంభంలో నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల్లో మెుత్తం రూ.15,446 కోట్లు ($1.87 బిలియన్లు) పెట్టుబడి పెట్టారు. అయితే ఈ సంస్థ మరోసారి అదానీ కంపెనీల్లో దాదాపు 500 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.
హిండెన్ బర్గ్ దెబ్బ తర్వాత అదానీ గ్రూప్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఫలవంతంగా మారాయి. దీంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగటంతో అదానీ స్టాక్స్ స్థిరమైన రికవరీని నమోదు చేశాయి. దీంతో అమెరికా ఆధారిత GQG పెట్టుబడి విలువ ఇప్పటికే 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని వెల్లడైంది. దీని ప్రకారం చూస్తుంటే పెట్టుబడి సంస్థ దాదాపు 58 శాతం రాబడిని పొందినట్లు తెలుస్తోంది. అలాగే ఐదేళ్ల కాలంలో అదానీ కంపెనీల్లో అతిపెద్ద పెట్టుబడిదారుల్లో ఒకరిగా ఉండాలని భావిస్తున్నట్లు జైన్ వెల్లడించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications