భారత రత్న ఇవ్వాలనే ప్రచారం మానేయండి, నెటిజన్లకు రతన్ టాటా వినతి
భారత రత్న.. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం. వివిధ రంగాల్లో అసమాన ప్రతిభ కనబరిచిన వారికి అందజేస్తారు. బతికి ఉండగా/ చనిపోయిన వారికి కూడా ఇస్తారు. అయితే ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలనే ప్రచారం జోరందుకుంది. సోషల్ మీడియాలో తెగ ట్రెండవుతోంది. #BharatRatnaForRatanTata క్యాంపెయిన్ నడుస్తోంది. అయితే దీనిపై రతన్ టాటా స్పందించారు.
భారత రత్న ఇవ్వాలని సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపెయిన్ నిలిపివేయాలని రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. భారత రత్న ఇవ్వాలంటోన్న కొందరి అభిప్రాయలను గౌరవిస్తా.. దయచేసి క్యాంపెయిన్ ఆపాలని కోరారు. భారత రత్న కంటే ముందు.. తాను భారతీయుడినని గుర్తుచేశారు. దేశాభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని అన్నారు.
రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో #BharatRatnaForRatanTata పేరుతో క్యాంపెయిన్ నడుస్తోంది. దీనిపై ఇవాళ ట్విట్టర్లో రతన్ టాటా స్పందించారు. భారత రత్న ఇవ్వాలనే క్యాంపెయిన్ నిలిపివేయాలని కోరారు. రతన్ టాటా పిలుపుతో నెటిజన్లు తమ ట్రెండ్ మానివేస్తారో చూడాలి.