Stock Exchange: దేశ, విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు ట్రేడింగ్, ఇన్వెస్ట్ చేయడానికి భారత్ లో రెండు ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ లు ఉన్నాయి. వాటిలో ఒకటి అత్యంత పూరతన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కాగా మరొకటి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్. అయితే గతంలో మూసివేయబడిన మరో ఎక్స్ఛేంజ్ తిరిగి ఆపరేషన్స్ జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుంచి సానుకూల సంకేతాలతో మరో ఎక్స్ఛేంజ్ వాడుకలోకి రాబోతోంది. మార్చి-ఏప్రిల్ 2024 నాటికి దేశంలో మూడవ ఎక్స్ఛేంజ్గా కలకత్తా స్టాక్ ఎక్స్ఛేంజ్ (CSE) పునరాగమనం చేయాలని భావిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు.

రెగ్యులేటరీ మరియు కంప్లయన్స్ సమస్యల కారణంగా ఏప్రిల్ 2013లో CSEని సెబీ ట్రేడింగ్ చేయకుండా నిషేధించింది. అయితే ఇప్పుడిది తిరిగి పునరాగమనం చేయబోతోంది. 'మేము త్వరలో దేశంలోని మూడవ ఈక్విటీ ఎక్స్ఛేంజ్ గా తిరిగి వస్తాము. దీనిపై మాకు సానుకూల అభిప్రాయం ఉంది. మేము కొన్ని చర్యలకు కట్టుబడి ఉండాల్సి ఉంది. జనవరి నాటికి అవి కాస్తా పూర్తవుతాయి' అని CSE చీఫ్ జనరల్ మేనేజర్ ధీరజ్ చక్రవర్తి వెల్లడించారు.
ప్రస్తుతం CSE తన కస్టమర్లకు NSE ప్లాట్ఫారమ్లో ట్రేడింగ్ చేయడానికి సౌకర్యాలను కల్పించి మనుగడ సాగిస్తోంది. 'సెబీ ఆమోదంతో, కలకత్తా హైకోర్టు నిర్ణయానికి లోబడి ట్రేడింగ్ మరియు సెటిల్మెంట్ పునఃప్రారంభించాలని CSE భావిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో స్వంత ప్లాట్ఫారమ్లో పోర్ట్ఫోలియోను విస్తరించాలని చూస్తోంది. కరెన్సీ మరియు కమోడిటీ ట్రేడింగ్ను కూడా అందించాలని ప్రయత్నిస్తోంది' అని CSE ఛైర్మన్ దీపాంకర్ బోస్ వాటాదారులకు తెలియజేశారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications