Hyderabad Metro: జనాన్ని భారీగా బాదిన హైదరాబాద్ మెట్రో.. కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
CAG report on Metro: నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ను తట్టుకుని కార్యాలయాలకు సమయానికి చేరుకోవాలంటే ఉత్తమ మార్గం మెట్రో రైలు. హైదరాబాద్లో దానికి ఉన్న ఆదరణ ఎంతో అందరికీ తెలిసిందే. అయితే ఆ సంస్థ అకౌంట్స్ తనిఖీ చేసిన కాగ్ ఓ కీలక రిపోర్ట్ విడుదల చేసింది. అందులో విస్తుపోయే విషయాలు పేర్కొంది.
మొదట అంగీకరించిన దానికంటే పెద్దమొత్తంలో ఛార్జీలు వసూలు చేయడానికి L&T మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (LTMRH)కు అనుమతి ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక గుర్తించింది. నవంబర్ 2017 మరియు మార్చి 2020 మధ్య ప్రయాణీకులపై అధిక ఛార్జీలు విధించినట్లు తెలిపింది. ఫలితంగా 213.77 కోట్లు అదనంగా వసూలు చేసినట్లు ప్రకటించింది.

ప్రభుత్వం తన బకాయిలు పొందడంలో రాయితీ ఒప్పందం నిబంధనల అమలును కాగ్ హైలైట్ చేసింది. మెట్రో కారిడార్లను ఖరారు చేయడంలో జాప్యం, మియాపూర్ డిపో కోసం భూసేకరణలో ఆలస్యం కలిసి వ్యయ పెరుగుదలకు దోహదపడిన గణనీయమైన అంశాలుగా గుర్తించింది. అదనంగా MGBS, ఫలక్నుమా స్టేషన్ల మధ్య 5.12 కి.మీ విస్తరించి ఉన్న మెట్రో కారిడార్-IIలో అసంపూర్తిగా ఉన్న 6 స్టేషన్ల అభివృద్ధి కూడా వ్యయాలు పెరగడానికి కారణమని తేల్చింది.
ఈ ప్రాజెక్టు విజయం కోసం ప్రభుత్వానికి ఓ కార్యాచరణ ప్రణాళికను కాగ్ సిఫార్సు చేసింది. మొదట అనుకున్నట్లుగా కారిడార్-IIని ఫలక్నుమా వరకు వెంటనే పూర్తి చేయాలని సూచించింది. అలా చేయడంలో విఫలమైతే రైడర్షిప్ తక్కువగా ఉంటుందని హెచ్చరించింది. హైదరాబాద్ మెట్రో రైల్ (HMR) నుండి వచ్చిన కంప్లైయన్స్ ఆడిట్ నివేదిక కూడా ఊహించిన రైడర్షిప్లో 22 శాతం మాత్రమే సాధించిందని అంగీకరించడం విశేషం.


Click it and Unblock the Notifications