తెలంగాణలోని రోడ్డు నెట్వర్క్ను మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA).. నేషనల్ హైవే-167 (NH-167) ను నాలుగు లేన్లుగా విస్తరించడానికి రూ. 3,175.08 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా హైదరాబాద్- పనాజీ (Hyderabad - Panaji) - ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఉండనుంది.

ప్రాజెక్ట్ హైలైట్స్
మహబూబ్నగర్ జిల్లా నుంచి గుడెబల్లూర్ వరకు ఉన్న సుమారు 80.01 కిలోమీటర్ల మేర ఈ రహదారిని విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో రోడ్లు ఇరుగ్గా ఉండటం, జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల గుండా వెళ్లడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొత్త ప్రాజెక్టుతో ఆ కష్టాలన్నీ తీరనున్నాయి.
- మొత్తం ఖర్చు: రూ. 3,175.08 కోట్లు.
- పొడవు: 80.01 కిలోమీటర్లు.
- బైపాస్ రోడ్లు: ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా 36.8 కిలోమీటర్ల మేర బైపాస్లు , రిఅలైన్మెంట్లను నిర్మిస్తారు.
- ప్రయోజనం పొందే జిల్లాలు: నారాయణ్ పేట్ , మహబూబ్నగర్.
ప్రయాణం మరింత సులభం
ప్రస్తుతం గుడెబల్లూర్, మక్తల్, మరికల్, దేవరకద్ర, జక్లేర్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ విస్తరణ పూర్తయితే హైదరాబాద్ (Hyderabad) వంటి పారిశ్రామిక కేంద్రాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. అంతేకాకుండా ఇది NH-150 , NH-167N వంటి ప్రధాన జాతీయ రహదారులతో అనుసంధానించబడుతుంది. దీనివల్ల వస్తు రవాణా (Logistics) వేగంగా జరగడమే కాకుండా, ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది.
ఆర్థిక ప్రయోజనాలు.. ఉపాధి..
ఈ భారీ ప్రాజెక్టు కేవలం రోడ్లకే పరిమితం కాలేదు. దీని నిర్మాణ సమయంలో సుమారు 14.4 లక్షల మందికి నేరుగా 17.9 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. అలాగే, పీఎం గతి శక్తి (PM Gati Shakti) కింద ఈ రహదారిని లాజిస్టిక్ నోడ్స్ , ఎకనామిక్ జోన్లతో అనుసంధానించడం వల్ల కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫార్మా క్లస్టర్లు , మెడికల్ సెజ్ (SEZ) లకు ఇది పెద్ద అసెట్ కానుంది.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా..
2024-25 ఆర్థిక సంవత్సర అంచనాల ప్రకారం.. ఈ మార్గంలో రోజుకు సగటున 17,991 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంతటి భారీ రద్దీని తట్టుకోవాలంటే నాలుగు లేన్ల రహదారి అత్యవసరం. ప్రాజెక్టు వ్యయంలో సివిల్ పనుల కోసం రూ. 1,868.90 కోట్లు.. భూసేకరణ, ఇతర ఖర్చుల కోసం రూ. 459.11 కోట్లు కేటాయించారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఆధ్యాత్మిక , పర్యాటక ప్రాంతాలకు కూడా వెళ్లడం సులభతరం అవుతుంది.
మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడమే కాకుండా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపిరి పోయనుంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications