కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్, డీఏ 3% పెంపుకు ఓకే

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మూడు శాతం డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR)ను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ప్రాథమిక వేతనం/పెన్షన్‌లో ప్రస్తుతం ఉన్న 28 శాతం కంటే 3 శాతం పెరుగుదల ఉంది. ఈ చర్య వల్ల దాదాపు 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. డీఏ, డీఆర్ పెంపు వల్ల ఖజానాపై ఏడాదికి రూ.9,488.70 కోట్ల భారం పడనుంది.

డీఏ, డీఆర్ పెంపును కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇది స్వాగతించే విషయం.. హర్షించే అంశం. 2021 జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం.. దాదాపు ఏడాది పాటు పెండింగ్‌లో ఉన్న అనంతరం డీఏ, డీఆర్ పెంపుకు ఆమోదం తెలిపింది. గత ఏడాది కరోనా మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయ సేకరణ ఇబ్బంది కారణంగా 2020లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్ నెస్ అలవెన్స్, డియర్ నెస్ రిలీఫ్ ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

Cabinet Clears 3 percent Dearness Allowance Hike For Central Employees

గత జూలై నెలలో డీఏ, డీఆర్ పెంపు పునరుద్ధరణ లక్షలాదమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చింది. ఈ నిర్ణయం జూలై 1, 2021 నుండి అమలులోకి వచ్చింది. ఆ తర్వాత డీఏ, డీఆర్ 17 శాతం నుండి 28 శాతానికి పెరిగింది. డీఏ, డీఆర్ పెంపుతో రూ.34,400 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+