Byjus News: రైట్స్ ఇష్యూ బెడిసికొట్టడంతో పీకల్లోతు కష్టాల్లో బైజూస్.. ఖర్చులు తగ్గింపుకు కీలక నిర్ణయం..

Byjus Tution Points: ఒకప్పుడు విద్యారంగంలో వినూత్న అడుగులు వేస్తూ ఎడ్‌టెక్ యూనికార్న్ బైజూస్ ధ్రువతారగా ఎదిగింది. తదనంతర కాలంలో సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ దివాళా స్థాయికి దిగజారిపోయింది. తాజాగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.

బైజూస్‌కు దేశవ్యాప్తంగా దాదాపు 300 ఆఫ్‌లైన్ ట్యూషన్ సెంటర్స్ ఉన్నాయి. వాటిలో సుమారు 200 సెంటర్లను మూసివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫిబ్రవరిలో 50 ట్యూషన్ పాయింట్స్‌ను మూసివేయగా.. వచ్చే నెలలో తాజా నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది. కాగా ఎడ్‌టెక్‌ సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది.

Byjus going to shut down 200 tution centers out of 300 countrywide

ఇప్పటికే 300 సెంటర్లలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యలో బైజూస్ కోత విధించింది. మిగిలిన సిబ్బందిని ఇంటి నుండి పని చేయమని గత వారం ఆదేశించింది. ఆర్థిక కష్టాల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ కార్యాలయాలను సైతం వదులుకోవాల్సి వచ్చింది. కేవలం బెంగళూరులోని ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే ఉంచుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించాలని భావించినా.. పెట్టుబడిదారులతో వివాదాల నేపథ్యంలో అదికాస్తా నిలిచిపోయింది. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు బైజుస్ ఇండియా CEO అర్జున్ మోహన్ పునర్నిర్మాణ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా 20 వేల మంది ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఫిబ్రవరి వేతనాల్లో కొంత భాగాన్ని చెల్లించారు. త్వరలోనే మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని లేఖ రాశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+