Byjus: ఇప్పటికే ఆర్థిక నష్టాలు, ED సోదాలు, మేనేజ్మెంట్లోని కీలక వ్యక్తులు రాజీమానాలతో సతమతమవుతున్న బైజూస్పై మరో వివాదం అలుముకుంది. దేశంలోనే అత్యంత విలువైన ఎడ్యుటెక్ స్టార్టప్గా ప్రస్థానం మొదలెట్టి, ఉద్యోగుల PFను సమయానికి జమచేయలేక ఇబ్బంది పడుతోంది.
గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఉద్యోగుల భవిష్య నిధి (PF) చెల్లింపులను బైజూస్ ఆలస్యం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. తద్వారా PF చట్టాన్ని ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. కంపెనీపై ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చట్టపరమైన చర్యలకు దిగే అవకాశం ఉంది.

బైజూస్ దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు ఆలస్యంగా ఉద్యోగుల PFను జమచేస్తూ వస్తోంది. ఉద్యోగుల సేలరీ స్లిప్లలో PF కంట్రిబ్యూషన్ ఎంట్రీలు చూపించినా, గత ఏడాది నవంబర్ నుంచి ఇవి పాస్ బుక్లో రిఫ్లైక్ట్ కాలేదు. ఇది కాస్తా మీడియాలో రావడంతో PF చెల్లింపును కంపెనీ వేగవంతం చేసింది.
PF చెల్లింపుల్లో జాప్యం గురించి స్పందించడానికి బైజూస్ ప్రతినిధులు నిరాకరించారు. కాగా తాము సకాలంలోనే పే చేస్తున్నామని, పాస్ బుక్లో చూపించకపోవడం కేవలం రిఫ్లెక్షన్ లోపమేనని సన్నిహింత వర్గాలు తెలిపాయి. అయితే కేవలం సుమారు 13 వేల మంది సిబ్బంది మాత్రమే జనవరి, ఫిబ్రవరి మరియు మార్చికి PF చెల్లింపులు జమ అయినట్లు డేటా చూపిస్తోంది.


Click it and Unblock the Notifications