Byjus Crisis: బైజూ రవీంద్రన్పై ఈడీ ఉచ్చు.. లుక్ అవుట్ నోటీసు జారీకి డిమాండ్..
Byjus News: కొన్ని నెలల కిందట ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ లైన్ విద్యకు వేధికగా నిలిచిన బైజూస్ సంస్థ భవిష్యత్తు అంధకారంలోకి జారుకుంటోంది. దేశీయ స్టార్టప్ కంపెనీ ఆర్థిక పరిస్థితిపై అంతర్జాతీయంగానూ నీలినీడలు అలుముకుంటున్నాయి.
శుక్రవారం హై-వోల్టేజ్ ఇన్వెస్టర్ల సమావేశానికి ముందు బైజూ రవీంద్రన్ కళ్లు 'లుక్ అవుట్ నోటీసు', ఎడ్టెక్ కంపెనీ వ్యవస్థాపకుడికి దేశంలో జరిమానా విధించకుండా చూసేందుకు బైజు రవీంద్రన్పై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని ఈడీ పట్టుబట్టింది. బైజూస్ దేశం నుంచి విదేశీ నిధులను తరలించిందని.. వాటిని విదేశాల్లో పెట్టుబడులకు పంపినట్లు పేర్కొంది. ఇది ఫెమా-1999 నిబంధనలను ఉల్లంఘనగా పేర్కొంది. భారత ప్రభుత్వానికి ఆదాయాన్ని కోల్పోయేలా చేసిందని ఈడీ ఆరోపించింది.

కంపెనీపై ఏప్రిల్ 2023 దాడి తర్వాత.. 2011-2023 వరకు కంపెనీ సుమారు రూ.28,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందినట్లు బైజూస్పై ఫెమా సెర్చ్ వెల్లడి చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ వివిధ దేశాలకు దాదాపు రూ.9,754 కోట్లను తరలించినట్లు కనుగొంది. బైజూ రవీంద్రన్కు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసు జారీ చేయబడింది. బైజూకి చెందిన కొందరు పెట్టుబడిదారులు అతనిని తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ శుక్రవారం రవీంద్రన్ హై-వోల్టేజ్ EGMని ఎదుర్కోవలసి వచ్చింది. రవీంద్రన్ గత మూడేళ్లుగా దిల్లీ-దుబాయ్ మధ్య ఎక్కువగా ప్రయాణిస్తున్నట్లు వెల్లడైంది.
బైజూ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్పై కర్ణాటక హైకోర్టు స్పందించింది. ఎంపిక చేసిన పెట్టుబడిదారులు ఫిబ్రవరి 23న సమావేశమైన EGMలో ఆమోదించాలని ప్రతిపాదించిన ఏదైనా తీర్మానం ఈ పిటిషన్పై తుది విచారణ, పరిష్కారమయ్యే వరకు చెల్లదని ఉత్తర్వులో పేర్కొంది. అయితే షెడ్యూల్ ప్రకారం ఈజీఎంను కొనసాగించేందుకు కోర్టు అనుమతించింది. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్-1996లోని సెక్షన్ 9 కింద బైజు పిటిషన్ దాఖలు చేశారు. చట్టపరంగా బైజూ విషయంలో జరిగిన తప్పులను వారు ఎత్తిచూపారు. ప్రస్తుతం స్టార్టప్ కంపెనీ విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన ఆరోపణలను కూడా ఎదుర్కొంటోంది. గత ఏడాది ఈడీ నోటీసులపై స్పందింస్తూ బైజూ అవి పూర్తిగా సాంకేతికపరమైనవిగా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications