దేశంలో స్టార్టప్ కంపెనీల మధ్య కన్సాలిడేషన్ మరింత ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ఈ దిశగా ఇటీవలే డెకా కార్న్ క్లబ్ లో చేరిపోయిన ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ బైజూస్ వడివడిగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో ఫండింగ్ సాధించిన బైజూస్ ... ఇప్పుడు తన విస్తరణ ప్రణాళికలకు సరిపోయే కంపెనీల వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సందేహాలను నివృత్తి చేసే ఆన్లైన్ ప్లాట్ఫారం డౌట్ నట్ అనే స్టార్టుప్ కంపెనీ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఈ మేరకు ఈ రెండు కంపెనీల మధ్య జోరుగా చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. డౌట్ నట్ కొనుగోలు చేసేందుకు బైజూస్ తుది చర్చల దశకు చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో త్వరలోనే ఈ స్టార్టుప్ కంపెనీ బైజూస్ చేతికి అందివచ్చే అవకాశం ఉంది. ఈ లావాదేవీ పూర్తయితే బైజూస్ కు మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అందుకే గురి...
తనుశ్రీ నాగోరి, ఆదిత్య శంకర్ లు 2017 లో డౌట్ నట్ ను స్థాపించారు. కె 12 విద్యార్థులకు అనేక సబ్జెక్టుల్లో ఉండే రకరకాల అనుమానాలు ఇది నివృత్తి చేస్తుంది. విద్యార్థికి ఏదైనా ఒక డౌట్ ఉంటే దానికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ తీసి, డౌట్ నట్ కు పంపించాల్సి ఉంటుంది. వారు వీడియో ల రూపంలో సందేహాలను నివృత్తి చేస్తారు. మాథెమాటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులతో పాటు జెఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తున్నారు.
డౌట్ నట్ వెబ్సైటు, మొబైల్ ఆప్, వాట్సాప్, యూట్యూబ్ ఛానల్ ను నెలకు సుమారు 1.3 కోట్ల మంది విద్యార్థులు తమ సందేహాల నివృత్తి కోసం సందర్శిస్తున్నారు. ఇప్పటి వరకు డౌట్ నట్ సుమారు 25 కోట్ల సందేహాలను నివృత్తి చేసింది. ప్రాంతీయ భాషల్లో కూడా సేవలు అందిస్తుండటం అదనపు ఆకర్షణగా ఉంటోంది. మరో వైపు ఈ సేవలు పూర్తి ఉచితం కావటం మరో విశేషం.

15 మిలియన్ డాలర్ల పెట్టుబడి...
ఇప్పటి వరకు ఎలాంటి ఆదాయ వనరులు లేని డౌట్ నట్ కు పెట్టుబడుల వెల్లువ మాత్రం కొనసాగుతోంది. ఇటీవల చైనా కు చెందిన ప్రముఖ పెట్టుబడి సంస్థ టెన్సెన్ట్ నేతృత్వంలో ఈ కంపెనీ కి 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ 120 కోట్లు) పెట్టుబడి లభించింది.
దీంతో కంపెనీ కార్యకలాపాల విస్తరణ, టెక్నాలజీ అభివృద్ధి వంటి అంశాలపై డౌట్ నట్ దృష్టి సారించేందుకు మార్గం సుగమం అవుతుంది. సాధారణంగా ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీలకు ఇటీవల డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యమ్గా కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకే ఆన్లైన్ లో పాఠాలు బోధించే ప్లాట్ఫారం లకు అటు ఇన్వెస్టర్ల నుంచి ఇటు వినియోగదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉంటోంది.

100 మిలియన్ డాలర్ల విలువ...
డౌట్ నట్ ను స్థాపించి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అవుతోంది. కానీ, ఇటీవల లభించిన ఫండింగ్ తో ఈ కంపెనీ విలువ అమాంతం పెరిగిపోయింది. ఎంట్రాకర్ కథనం ప్రకారం దీని విలువ ఇప్పటికే 100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 800 కోట్లు) గా ఉందని తెలుస్తోంది. ఒక వేల బైజూస్ ఈ కంపెనీని పూర్తిగా కొనుగోలు చేస్తే కూడా అదే స్థాయి విలువ లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
డౌట్ నట్ ను కొనుగోలు చేయటం ద్వారా బైజూస్ చిన్న స్థాయి పట్టణాలకు కూడా తన సేవలు విస్తరించే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే నగరాల్లో బైజూస్ కు మంచి పట్టు ఉంది. కానీ ప్రాంతీయ భాషల్లో సేవలు అందించే డౌట్ నట్ తో దేశంలో తన విస్తరణ మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications