Adani: ప్రముఖ వ్యాపారి గౌతమ్ అదానీ ఎన్సీపీ చీఫ్ శరత్ పవార్ను కలిశారు. వీరిద్దరూ ముంబైలోని పవార్కు చెందిన సిల్వర్ ఓక్ రెసిడెన్సీలో కలిశారు. అయితే ఈ క్రమంలో వారిద్దరి మధ్య దాదాపు చర్చలు రెండు గంటల పాటు కొనసాగాయి. అసలు ఇందులో ఏం చర్చించారనే దానిపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇటీవల ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ అదానీ గ్రూప్కు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు తాను వ్యతిరేకం కాదని అంటూనే.. సుప్రీం కోర్టుతో కమిటీ ఉంటే మంచిదంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలవటం అటు రాజకీయంగాను, ఇటు వ్యాపార వర్గాల్లోనూ ఆసక్తి కొనసాగుతోంది. ఇద్దరి మధ్య సమావేశం ఎందుకు జరిగిందో ఇంకా తెలియరాలేదు.

ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన శరత్ పవార్ గతంలో ప్రతిపక్షాలు టాటా-బిర్లాలను టార్గెట్ చేసేవని.. ప్రస్తుతం అంబానీ-అదానీలపై ప్రస్తుతం వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. అయితే దేశాభివృద్ధిలో టాటా, బిర్లాలు ఎంతగా తోడ్పడ్డారనే విషయం ప్రస్తుతం ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు అదానీ-అంబానీ గ్రూప్ పేర్లను వాడుతున్నారని తెలిపారు.
అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ పెట్రో కెమికల్స్, ఇతర రంగాల్లో గణనీయమైన కృషి చేయగా.. అదానీ గ్రూప్ పవర్, ఇతర రంగాల్లో చాలా కృషి చేసిందన్నారు. అయితే వీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సరైన సాక్ష్యాలతో రుజువు చేసేందుకు ప్రజాస్వామ్యంలో అవకాశం ఉండగా.. ఎలాంటి ఆధారాలు చూపకుండా నిందించటం సరికాదన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకే అదానీకి వ్యతిరేకంగా హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టును కాంగ్రెస్ పట్టుకుందన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications