PM Modi: ప్రధాని మోదీకి తల్లి అంటే ఎంత ప్రేమో అనేక సందర్భాల్లో మనందరం చూశాం. అయితే 100 ఏళ్ల వయస్సులో హీరాబెన్ మోదీ మరణవార్త దేశంలో చాలా మంది గుండెలను ముక్కలు చేసింది. సాధారణ వ్యక్తుల నుంచి ప్రత్యేక వ్యక్తుల వరకు భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మరణవార్త తెలియగానే దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

ఆనంద్ మహీంద్రా..
ప్రధాని మోదీ మాతృవియోగం పొందటంపై దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఆ సందర్భంలో ఆయన తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు. వ్యాపార ప్రపంచానికి సంబంధించిన వ్యక్తులు ఈ దుఃఖ సమయంలో ప్రధాని మోదీకి అండగా నిలుస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మోదీ తల్లి మరణంపై చాలా ఎమోషనల్ ట్వీట్ చేస్తూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మహీంద్రా ఏమన్నారంటే..
"తల్లి ఏ వయస్సులో ఉన్నా.. ఆమెను కోల్పోవడం ఆత్మలో ఒక భాగాన్ని కోల్పోయినట్లే. శ్రీ నరేంద్ర మోదీకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అంటూ మహీంద్రా తన బాధను వ్యక్తపరిచారు. తల్లితో ప్రధాని మోదీకి ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. అయితే తల్లి మరణంపై ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఎక్కడా మాట్లాడలేదు.
మోదీ తల్లికి ఏమైంది..?
ప్రధాని తల్లి హీరాబెన్ రెండు రోజుల కిందట అకస్మాత్తుగా తీవ్ర అస్వస్ధతకు లోనయ్యారు. ఆమెను వెంటనే అహ్మదాబాద్లోని యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్లో చేర్చారు. నిన్న ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. తల్లి మరణవార్తతో ప్రధాని వెంటనే అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రధాని మోదీ తల్లి మరణవార్తతో దేశవ్యాప్తంగా ప్రజలు విషాదంలో మునిగిపోయారు. జపాన్ ప్రధానితో పాటు నేపాల్ దహల్ కూడా తమ సంతాపాన్ని ప్రకటించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications