ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం విధానాల కారణంగా ఆదాయం తగ్గుతోందని దుయ్యబడుతున్నారు. ప్రభుత్వ వైఖరితో పెట్టుబడులు రావడం లేదన్నారు. ఎక్కువగా అప్పులు తెచ్చుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీని మొదటి స్థానానికి తీసుకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థపై ఆయన ఏం చెప్పారంటే...

అప్పులు పెరిగాయి, వసూళ్లు తగ్గాయి..
ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యోల్భణం బాగా పెరిగింది. పన్ను వసూళ్లు ఏకంగా 7 శాతం మేర తగ్గిపోయాయి. వాహనాల సేల్స్ 31 శాతం పడిపోయాయి. ఇక రాష్ట్రం అప్పులు ఏకంగా 16 శాతం పెరిగాయి. పారిశ్రామికోత్పత్తి నిలిచి విద్యుత్ డిమాండ్ 16 శాతం మేర తగ్గింది.

ఇంతగా వాహన విక్రయం తగ్గిన రాష్ట్రం ఏపీనే
తొమ్మిది నెలల్లో వాహనాల విక్రయం ఆంధ్రప్రదేశ్లో 31 శాతం మేర తగ్గిపోయాయి. ఇంతగా తగ్గిన రాష్ట్రం దేశంలో ఇది ఒక్కటే. దాదాపు ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా ఆటో సేల్స్ పడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పడిపోయాయని టీడీపీ అధినేత చెబుతున్నారు.

ప్రజల కొనుగోలు శక్తి 60 శాతం పడిపోయింది
రాష్ట్రాలకు విమానాల రాకపోకలు ఏడు శాతం మేర తగ్గాయి. పన్ను వసూళ్లు కర్ణాటకలో 23 శాతం పెరిగాయి. కానీ ఏపీలో మాత్రం 7 శాతం తగ్గాయి. ప్రజల కొనుగోలు శక్తి ఏకంగా 60 శాతం వరకు పడిపోయింది.

తొమ్మిది నెలల్లోనే రూ.40వేల కోట్ల అప్పు
ఈ తొమ్మిది నెలల్లోనే రూ.40వేల కోట్ల అప్పులు చేశారు. దీంతో రుణభారం పదహారు రెట్లు పెరిగింది. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇంతగా అప్పులు చేయలేదు.

డేటా సెంటర్ వస్తే ఉద్యోగాలు
విశాఖపట్నంకు డేటా సెంటర్ పరిశ్రమ తేవాలని భావించాను. దీంతో వేలాది ఉద్యోగాలు వస్తాయి. కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కోసం లూలూ కంపెనీని ఒప్పించేందుకు కొచ్చిన్ వెళ్లి, అక్కడ కట్టిన మెగా కాంప్లెక్స్ను కూడా చూశాం. విశాఖలో డేటా సెంటర్, దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేందుకు తాము ఇంత కష్టపడితే జగన్ దీనిని కాలరాశారు. లూలూ కంపెనీ వస్తే విశాఖలో పర్యాటక రంగం కూడా పెరిగేది.

కియా కంపెనీ
అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీని ఏర్పాటు చేశాం. ఈ కంపెనీ రావడం వల్ల 20 వేల ఉద్యోగాలు వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాలకు వందల ట్రిప్పుల బస్సులు ఉద్యోగులతో తిరుగుతున్నాయి. అలాగే విశాఖకు కూడా డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు వచ్చేవి.

శివనాడార్ వస్తే..
HCL కంపెనీ శివనాడార్ విజయవాడకు వస్తే ఆయనను కార్లో విమానాశ్రయం వరకు దించి వచ్చాం. కియ కోసం కొరియాకు వెళ్లాం. లూలూ కంపెనీని ఒప్పించడానికి కొచ్చిన్ వెళ్లాం. విద్యుత్ పీపీఏలను తిరగదోడాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి.

మూడు రాజధానుల వల్ల భారం
మూడు రాజధానుల వల్ల రాష్ట్రంపై భారం పడుతుందని, ఎక్కువ ఖర్చు అవుతుందని, సమయం కూడా వృథా అవుతుందని చంద్రబాబు చెప్పారు. మూడు రాజధానుల వల్ల ఖర్చు, టైం వేస్ట్ అవుతున్నాయని సౌతాఫ్రికా ప్రధాని చెప్పారని, మన వద్ద మూడు రాజధానులు అంటే మూడు చోట్ల కార్లు, ఇళ్లు, కార్యాలయాలు ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులకు జీతాలు మూడు రెట్లు పెంచాలన్నారు. ఏడాదికి 365 రోజులే ఉందని, జగన్ మాయ చేసి దానిని 700కో 750 రోజులకో పెంచాలన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications