భారతదేశంలో ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రతను మెరుగుపరిచే దిశగా బడ్జెట్ (Budget 2026) లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే ఎస్బీఐ రీసెర్చ్ (SBI Research) తన 'ప్రిల్యూడ్ టు యూనియన్ బడ్జెట్ 2026-27' నివేదికలో పెన్షన్ రంగానికి సంబంధించి సంచలన సిఫార్సులను చేసింది. ముఖ్యంగా ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది.

UPS , NPS వాత్యల్య: విస్తరణ అవసరం
నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన UPS లో ఇప్పటివరకు కేవలం 1.2 లక్షల మంది మాత్రమే చేరారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు , PSU (ప్రభుత్వ రంగ సంస్థలు) ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ఎస్బీఐ రీసెర్చ్ సూచించింది. అలాగే చిన్నపిల్లల కోసం తీసుకొచ్చిన 'NPS వాత్యల్య' పథకంపై పన్ను రాయితీలు పెంచాలని, సెక్షన్ 80CCD(1B) కింద అదనపు మినహాయింపులు కల్పించడం ద్వారా దీనిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావచ్చని పేర్కొంది.
EPFO ఆధునీకరణ, పన్ను సడలింపులు
ప్రస్తుతం ఉన్న EPFO (ఉద్యోగుల భవిష్య నిధి) వ్యవస్థను NPS తరహాలో సాంకేతికత , పారదర్శకతతో ఆధునీకరించాలని నివేదిక కోరింది. దీనివల్ల ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు వారి పెన్షన్ ఖాతాలను సులభంగా తరలించుకోవచ్చు (Interoperability). అంతేకాకుండా ఇన్సూరెన్స్ ప్రొడక్టులు, పెన్షన్ స్కీమ్స్పై పన్ను విధింపులో సమానత్వం (Uniform Tax Treatment) ఉండాలని, తద్వారా ఇన్వెస్టర్లు పన్ను ప్రయోజనాల కోసం కాకుండా తమ అవసరాల మేరకు సరైన పథకాన్ని ఎంచుకుంటారని ఎస్బీఐ రీసెర్చ్ విశ్లేషించింది.
ప్రైవేట్ రంగానికి తప్పనిసరి NPS?
ప్రైవేట్ రంగంలో పని చేసే కోట్లాది మందికి పెన్షన్ సౌకర్యం లేదు. దీనిని పరిష్కరించడానికి, 100 లేదా 200 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రైవేట్ సంస్థల్లో NPS సహకారాన్ని తప్పనిసరి చేయాలని ఎస్బీఐ ప్రతిపాదించింది. ఇది భారత్లో పెన్షన్ కవరేజీని గణనీయంగా పెంచుతుంది.
UPS & NPS మధ్య రిలేషన్...
పెన్షన్ ఎంపిక విషయానికి వస్తే, ప్రభుత్వ ఉద్యోగులకు Budget 2026 లో UPS ఒక వరంలా మారనుంది. ఎందుకంటే, UPS కింద ఉద్యోగి పదవీ విరమణ చేసిన చివరి 12 నెలల సగటు జీతంలో 50 శాతం పెన్షన్గా గ్యారెంటీగా లభిస్తుంది. అంతేకాకుండా ధరల పెరుగుదలకు అనుగుణంగా 'డియర్నెస్ రిలీఫ్' (DR) కూడా అందుతుంది. దీనికి విరుద్ధంగా, NPS అనేది పూర్తిగా మార్కెట్ గమనంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, పక్కాగా ఇంత పెన్షన్ వస్తుందని చెప్పలేము. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను గమనించి, ఇన్వెస్టర్లు తమ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలని ఎస్బీఐ నివేదిక స్పష్టం చేస్తోంది.
మొత్తానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తులో ఉద్యోగులకు మరింత ఆర్థిక భరోసా లభిస్తుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications