భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షల తీరు మారబోతోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న బడ్జెట్ (Budget 2026) లో విద్యా రంగానికి సంబంధించి భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా "వన్ నేషన్, వన్ ఎగ్జామ్" అనే నినాదం ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. కేవలం సీట్ల సంఖ్యను పెంచడం మాత్రమే కాకుండా విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా అడుగులు పడనున్నాయి.

1978 నుంచి నేటి వరకు ఉన్న ఐఐటీ-జేఈఈ (JEE) గణాంకాలను గమనిస్తే ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. గత ఐదు దశాబ్దాల్లో సీట్ల సంఖ్య 7 రెట్లు పెరిగితే.. పోటీ పడే విద్యార్థుల సంఖ్య మాత్రం ఏకంగా 48 రెట్లు పెరిగింది. ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నప్పటికీ.. పోటీ మాత్రం రోజురోజుకూ కఠినతరమవుతోంది. ఈ అంతరాన్ని తగ్గించడమే ఈ సారి బడ్జెట్ (Budget 2026) ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
AI & డిజిటల్ విద్యకు పెద్ద పీట
రాబోయే బడ్జెట్ (Budget 2026) లో 'దీక్ష' (DIKSHA), 'స్వయం' (SWAYAM) వంటి ప్రభుత్వ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్లాట్ఫారమ్లకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. కేవలం బట్టీ పట్టడం కాకుండా, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని (Skill-based learning) పెంపొందించడంపై ఫోకస్ పెట్టనున్నారు. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను తక్కువ ధరకే అందుబాటులోకి తేవడమే ఈ బడ్జెట్ లక్ష్యం.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
ప్రస్తుతం టాప్ 500 ర్యాంకర్లలో 90 శాతం మంది కేవలం ఐఐటీ బాంబే వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే దేశంలోని మిగిలిన సంస్థలకు, వీటికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. అందుకే పోటీ పరీక్షలన్నింటినీ క్రమబద్ధీకరించి.. ఏడాదికి ఒకసారి కాకుండా ఎప్పుడైనా రాసుకునేలా "ఆప్టిట్యూడ్" ఆధారిత పరీక్షలను ప్రవేశపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) అమలులో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో శిక్షణ నిధులు పెంచే అవకాశం ఉంది. నేడు దేశంలో పదివేల కంటే తక్కువ మంది సర్టిఫైడ్ కెరీర్ కౌన్సిలర్లు ఉన్నారు. విద్యార్థులు ఏ రంగం ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అందుకే పాఠశాల విద్యతోనే కోచింగ్ ను అనుసంధానం చేసి, చిన్నప్పటి నుంచే సాఫ్ట్ స్కిల్స్ , టెక్నికల్ స్కిల్స్ నేర్పించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
ఏదేమైనా మొత్తానికి ప్రభుత్వం మిగతా రంగాలతో పాటు విద్యా రంగంపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలని నిపుణులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం, కోచింగ్ సెంటర్లు పోటీదారులుగా కాకుండా, భాగస్వాములుగా పనిచేసినప్పుడే భారత విద్యార్థుల భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. మరి చూద్దాం ఈ బడ్జెట్ లో విద్యా రంగానికి మేలు చేసేలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో!
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications