సాధారణంగా బడ్జెట్ అనగానే మనందరం ఆదాయపు పన్ను స్లాబ్లలో మార్పులు ఉంటాయని, చేతికి వచ్చే జీతం పెరుగుతుందని ఆశపడతాం. కానీ, ఈ బడ్జెట్ లో అటువంటి ప్రత్యక్ష ఊరట ఏదీ లభించలేదు. పైగా మనం చేసే పొదుపు , పెట్టుబడులపై ప్రభుత్వం 'నిశ్శబ్దంగా' పన్ను భారాన్ని పెంచేసింది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, బంగారం వంటి వాటిపై కొత్త నిబంధనలు సామాన్యుల ఆర్థిక ప్రణాళికలను ప్రభావితం చేయనున్నాయి.

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో భారీ మార్పులు
ట్రేడింగ్ చేసే వారికి ఈ బడ్జెట్ పెద్ద షాక్ ఇచ్చింది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT)ని ప్రభుత్వం పెంచింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్పై పన్నును 0.02% నుండి 0.05%కి, అలాగే ఆప్షన్స్ ట్రేడింగ్పై 0.1% నుండి 0.15%కి పెంచారు. వినడానికి ఈ సంఖ్యలు చిన్నవిగా అనిపించినా.. తరచుగా ట్రేడింగ్ చేసే వారికి ఇది పెద్ద భారమే. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ను తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం అని చెబుతున్నా, రిటైల్ ఇన్వెస్టర్ల లాభాలపై ఇది గట్టి ప్రభావం చూపుతుంది.
బంగారం (Gold)పై కొత్త రూల్స్
చాలా మందికి బంగారం (Gold) అంటే కేవలం ఆభరణాలే కాదు, ఒక సురక్షితమైన పెట్టుబడి కూడా. అందుకే సావరిన్ గోల్డ్ బాండ్స్ కి మంచి క్రేజ్ ఉండేది. అయితే బడ్జెట్ 2026లో దీనిపై ఒక కీలక మార్పు చేశారు. ఏప్రిల్ 1, 2026 నుండి, మీరు ఆర్బీఐ (RBI) దగ్గర నేరుగా కొన్న బాండ్లకు మాత్రమే మెచ్యూరిటీ సమయంలో ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఒకవేళ మీరు స్టాక్ ఎక్స్ఛేంజ్ల (Secondary Market) ద్వారా ఇతరుల నుండి ఈ బాండ్లను కొనుగోలు చేస్తే, మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభాలపై 12.5% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల పాత గోల్డ్ బాండ్ల కొనుగోలు ఇకపై అంత లాభదాయకం కాకపోవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్, డివిడెండ్లపై పన్ను
మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు కూడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గతంలో, ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీని (20% వరకు) డివిడెండ్ ఆదాయం నుండి మినహాయింపుగా పొందే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ బెనిఫిట్ను పూర్తిగా తొలగించారు. అంటే ఇకపై మీరు లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేసినా.. ఆ వడ్డీకి ఎటువంటి ట్యాక్స్ మినహాయింపు ఉండదు. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ల ద్వారా వచ్చే నికర ఆదాయం తగ్గుతుంది.
ఆడిట్ ఆలస్యమైతే భారీ పెనాల్టీలు
కేవలం పెట్టుబడులే కాదు, నిబంధనల విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ట్యాక్స్ ఆడిట్ రిపోర్టులను సకాలంలో సమర్పించకపోతే భారీ జరిమానాలు విధిస్తారు. ఒక్క రోజు ఆలస్యమైనా రూ.75,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నెల రోజులు దాటితే అది రూ.1.5 లక్షల వరకు పెరుగుతుంది. ఇది చిన్న వ్యాపారులకు, ప్రొఫెషనల్స్ కు పెద్ద సవాలుగా మారనుంది.
మొత్తానికి ఈ సారి బడ్జెట్ చూస్తుంటే.. ఆదాయపు పన్ను రేట్లు పెంచకపోయినా, ఇన్వెస్ట్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయంపై పన్నులను పెంచి ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇన్వెస్టర్లు ఇప్పుడు తమ పోర్ట్ఫోలియోలను ఒకసారి పునఃసమీక్షించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా బంగారం (Gold),షేర్ మార్కెట్ ట్రేడింగ్ విషయంలో కొత్త ట్యాక్స్ రూల్స్ను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Gold: దుబాయ్లో డిస్కౌంట్కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!



Click it and Unblock the Notifications