మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఏటా ఎదురుచూసే బడ్జెట్ (Budget 2026) సమయం రానే వచ్చింది. దేశ వ్యాప్తంగా సామాన్యుడు ఆశించేది ఒక్కటే.. తన చేతిలో నాలుగు రాళ్లు ఎక్కువ మిగలాలని. పెరిగిన ధరలు, పెరుగుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో, ఈ సారి ప్రభుత్వం పన్ను స్లాబుల్లో మార్పులు చేసి సామాన్యుడికి భారీ ఊరటనిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆదాయపు పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండటంతో.. ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హోమ్ లోన్ వడ్డీపై రాయితీ పెరగనుందా?
చాలా ఏళ్లుగా గృహ రుణ గ్రహీతలు ఒకే విన్నపం చేస్తున్నారు. ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీపై రూ. 2 లక్షల వరకు మాత్రమే మినహాయింపు ఉంది. కానీ, ప్రస్తుత రియల్ ఎస్టేట్ ధరలు, వడ్డీ రేట్లు చూస్తుంటే ఇది ఏ మూలకూ సరిపోవడం లేదు. అందుకే ఈ పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో ఈ నిర్ణయం తీసుకుంటే, మధ్యతరగతి ప్రజలకు ఇల్లు కొనాలనే కల మరింత సులభం అవుతుంది.
మహిళా పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం.. ఈ బడ్జెట్ లో మహిళా ఉద్యోగులకు లేదా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పన్ను మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలు మళ్లీ ఉద్యోగాల్లో చేరినప్పుడు వారికి పన్ను రాయితీలు ఇవ్వాలని, మహిళా స్టార్టప్ లకు తక్కువ పన్ను రేట్లు ఉండాలని ప్రతిపాదనలు అందుతున్నాయి.
పాత పన్ను విధానం (Old Tax Regime) మారుతుందా?
2017-18 నుండి పాత పన్ను విధానంలో స్లాబులు దాదాపుగా స్తంభించిపోయాయి. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పాత విధానాన్ని ఎంచుకునే వారికి కూడా ఊరటనివ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు, రిటైర్మెంట్ ఫండ్స్ (PF/Gratuity) విషయంలో డబుల్ ట్యాక్సేషన్ (రెండు సార్లు పన్ను పడటం) సమస్యను పరిష్కరించాలని సామాన్యులు కోరుకుంటున్నారు. రూ. 7.5 లక్షల కంటే ఎక్కువ కంపెనీ వాటా ఉంటే పడే పన్ను భారం తగ్గించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
మొబీల్ ఎంప్లాయీస్ కోసం కొత్త రూల్స్?
నేటి కాలంలో ఒకే కంపెనీలో పనిచేస్తూ వివిధ దేశాలకు లేదా రాష్ట్రాలకు వెళ్లే 'మొబీల్ ఎంప్లాయీస్' సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను చట్టం 2025లో వీరి పన్నుల విషయంలో కొన్ని స్పష్టత లేని అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈక్విటీ అవార్డులు, ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్ విషయంలో ఈ సారి బడ్జెట్ (Budget 2026) స్పష్టమైన నిబంధనలు తీసుకువస్తే, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం మరింత సులభమవుతుంది.
మొత్తానికి ప్రభుత్వం పన్ను స్లాబులను విస్తరించడం ద్వారా సామాన్యుల కొనుగోలు శక్తిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు ఉంటే, అది ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచి, దేశ వృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక వేత్తల అభిప్రాయం.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications