మరో కొన్ని రోజుల్లో దేశం మొత్తం ఎదురుచూస్తున్న బడ్జెట్ (Budget 2026) రాబోతోంది. ముఖ్యంగా జీతం తీసుకునే ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఈసారి నిర్మలా సీతారామన్ గారి నుంచి ఏవైనా కీలక ఉపశమనాలు లభిస్తాయా? అని వెయ్యి కళ్లతో చూస్తున్నారు. 2025 బడ్జెట్లో రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇచ్చి ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. అయితే, ఈ ఏడాది అంతకంటే పెద్ద మార్పు ఒకటి చర్చల్లో ఉంది. అదే "జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్" (Joint Tax Filing for Married Couples).

ఏమిటి ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్?
ప్రస్తుతం మన దేశంలో భర్త సంపాదనకు భర్త, భార్య సంపాదనకు భార్య విడివిడిగా ఆదాయపు పన్ను (Income Tax) లెక్కలు చూపిస్తారు. కానీ, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకే యూనిట్ గా పన్ను చెల్లించే వెసులుబాటు ఉంది. ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో దీనిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల ఒక కుటుంబం మొత్తం ఒకే ఎకనామిక్ యూనిట్ గా పరిగణించబడుతుంది.
ఎవరికి ఎక్కువ లాభం?
ప్రస్తుత పన్ను విధానంలో ఒకే వ్యక్తి సంపాదనపై ఆధారపడే కుటుంబాలు (Single Income Families) ఎక్కువ నష్టపోతున్నాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నా, పన్ను విషయంలో వారికి ప్రత్యేక మినహాయింపులు ఉండవు. ఈ జాయింట్ ఫైలింగ్ విధానం వస్తే..
- ఒకే సంపాదన ఉన్న కుటుంబాలకు బేసిక్ ఎగ్జంప్షన్ పరిమితి పెరిగే అవకాశం ఉంది.
- భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్నా, ఇద్దరి ఆదాయాన్ని కలిపి చూపడం ద్వారా ట్యాక్స్ స్లాబ్ ప్రయోజనాలను మెరుగుపరుచుకోవచ్చు.
- పన్ను చెల్లింపు ప్రక్రియ (Tax Filing) చాలా సులభతరం అవుతుంది.
బడ్జెట్ 2026: అంచనాలు, విశ్లేషణలు
గత ఏడాది రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో, ఈసారి ట్యాక్స్ స్లాబ్స్లో భారీ మార్పులు ఉండకపోవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. కానీ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation) దృష్ట్యా స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) పరిమితిని పెంచే అవకాశం ఉందని సమాచారం.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కేవలం రేట్లను తగ్గించడమే కాకుండా, పన్ను వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు తేవడంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే జాయింట్ ఫైలింగ్ అనేది మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది.
మరిన్ని కీలక ఆశలు..
వచ్చే బడ్జెట్ (Budget 2026) లో పాత పన్ను విధానం (Old Tax Regime) మరియు కొత్త పన్ను విధానం (New Tax Regime) మధ్య ఉన్న అయోమయాన్ని తొలగించి మరింత సరళమైన ఆదాయపు పన్ను చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. టీడీఎస్ (TDS), టీసీఎస్ (TCS) నిబంధనలను మరింత సులభతరం చేయడం ద్వారా సామాన్యుడిపై భారం తగ్గించేలా చర్యలు ఉంటాయని టాక్.
ఏదేమైనా ఒకవైపు ధరలు పెరుగుతున్న తరుణంలో, చేతికి వచ్చే జీతం (Take-home pay) పెరగాలని ప్రతి ఉద్యోగి కోరుకుంటున్నాడు. మరి ఈ సారి బడ్జెట్ లో ప్రభుత్వం జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుని సామాన్యుడి ముఖంలో నవ్వులు పూయిస్తుందో లేదో చూడాలి!
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications