భారతదేశం 2047 నాటికి 'వికసిత్ భారత్'గా మారాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశంలోని ఇళ్లల్లో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని ఉత్పాదక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే బడ్జెట్ (Budget 2026) లో డిజిటల్ గోల్డ్, గోల్డ్ లోన్ సెక్టార్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

డిజిటల్ గోల్డ్: ఐడిల్ గోల్డ్కు మోక్షం!
విఘ్నహర్త గోల్డ్ లిమిటెడ్ చైర్మన్ మహేంద్ర లూనియా అభిప్రాయం ప్రకారం, భారతీయుల వద్ద ఉన్న టన్నుల కొద్దీ బంగారాన్ని డిజిటల్ రూపంలోకి మార్చడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభిస్తుంది. ప్రస్తుతం తులం బంగారం ధర సుమారు రూ. 1.5 లక్షలకు చేరుకోవడంతో ప్రజలు భారీ ఆభరణాల కంటే ఒక గ్రాము గోల్డ్ లేదా ఇన్వెస్ట్మెంట్ కాయిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ లాకర్లలో ఉండిపోవడం వల్ల లిక్విడిటీ (ద్రవ్యత) సమస్య ఏర్పడుతోంది. అందుకే బడ్జెట్ (Budget 2026) లో డిజిటల్ గోల్డ్ ను ప్రోత్సహించే విధానాలు తీసుకురావాలని వారు కోరుతున్నారు. దీనివల్ల రూ. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం మరింత సులభమవుతుంది.
సావరీన్ గోల్డ్ బాండ్లు (SGB) మళ్లీ వస్తాయా?
గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రజల్లో మంచి మార్పు తీసుకువచ్చింది. అయితే ఇటీవల ఈ స్కీమ్ను నిలిపివేయడంపై చర్చ జరుగుతోంది. బాండ్ల ద్వారా ప్రభుత్వం సులభంగా మూలధనాన్ని సేకరించవచ్చని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి బడ్జెట్ (Budget 2026) లో మళ్ళీ గోల్డ్ బాండ్లను పునఃప్రారంభించాలని పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
గోల్డ్ లోన్ సెక్టార్: ట్యాక్స్ ఉపశమనం అవసరమా?
ఇండెల్ మనీ సీఈఓ ఉమేష్ మోహనన్ ప్రకారం.. గోల్డ్ లోన్లు అనేవి కేవలం ఖర్చు కోసం తీసుకునేవి కావు, అవి చిన్న వ్యాపారులకు, రైతులకు అత్యవసర పెట్టుబడి వనరులు. ప్రస్తుతం గోల్డ్ లోన్ వడ్డీపై జీఎస్టీ లేకపోయినప్పటికీ, ప్రాసెసింగ్ ఫీజులు, లోన్ ఎక్స్టెన్షన్ ఛార్జీలపై 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇది సామాన్యులకు భారం.
- ఆర్థిక సమ్మిళితం: గోల్డ్ లోన్లు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య మరియు వైద్య అత్యవసరాల కోసం ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి.
- మార్కెట్ వృద్ధి: 2025 మార్చి నాటికి రూ. 12 లక్షల కోట్లుగా ఉన్న గోల్డ్ లోన్ మార్కెట్.. 2027 నాటికి రూ. 18 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.
మొత్తానికి ఈ సారి బడ్జెట్ (Budget 2026) కేవలం పన్నుల మార్పులకే పరిమితం కాకుండా భారతీయుల బంగారు పొదుపును దేశాభివృద్ధిలో భాగం చేసేలా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. గృహాల్లో ఉన్న సుమారు 34,600 టన్నుల బంగారాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ నిర్ణయాలు మరికొద్ది రోజుల్లోనే వెలువడనున్నాయి. అప్పటి వరకు వేచి చూడాల్సిందే!
More From GoodReturns

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications