కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో వరుసగా తన తొమ్మిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వ ఆదాయ వనరులు, వ్యయ ప్రాధాన్యతలు మాత్రమే కాకుండా, రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశం ఏ దిశగా ప్రయాణించబోతోందన్న దానిపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వనుంది. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బడ్జెట్ 2026కు రాజకీయంగా, ఆర్థికంగా ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల ఈ రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, రంగాల వారీ కేటాయింపులు, కేంద్ర సహాయ ప్రకటనలు బడ్జెట్లో కీలకంగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని బడ్జెట్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. అదే ధోరణి ఈసారి కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

దేశంలో జనాభా పరంగా, రాజకీయంగా కీలకమైన రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలుస్తోంది. ఇటీవలి కాలంలో రోడ్లు, జాతీయ రహదారులు, పట్టణ రవాణా ప్రాజెక్టులపై కేంద్రం భారీగానే దృష్టి పెట్టింది. కోల్కతా నుంచి సిలిగురి వరకు విస్తరించే ఆర్థిక కారిడార్, జాతీయ రహదారి విస్తరణ, మెట్రో రైలు ప్రాజెక్టులు, ఓడరేవు ఆధారిత మౌలిక సదుపాయాలు రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారాయి. రైల్వే రంగంలో కూడా భారీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఇటీవలే హౌరా నుంచి గౌహతి వరకు నడిచే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించడం ఇందుకు ఉదాహరణ. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలోని 100కు పైగా రైల్వే స్టేషన్లను వేల కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరిస్తున్నారు.
తమిళనాడులో గత బడ్జెట్లు ప్రధానంగా లాజిస్టిక్స్, రవాణా మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించాయి. మధురై-కొల్లం, చిత్తూరు-థాచూర్ వంటి హైవే కారిడార్లు, పారిశ్రామిక పార్కులు, తయారీ మౌలిక వసతులకు కేంద్ర మద్దతు లభించింది. దేశంలో ఒక ప్రధాన తయారీ, ఎగుమతి కేంద్రంగా ఉన్న తమిళనాడులో, పారిశ్రామిక కారిడార్లు, ఓడరేవు కనెక్టివిటీకి మరింత ప్రోత్సాహం లభించే అవకాశముంది.
కేరళ రాష్ట్రం ఇటీవలి సంవత్సరాల్లో హైవేలు, పట్టణ రవాణా వ్యవస్థలు, తీరప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ మద్దతును పొందింది. ముంబై-కన్యాకుమారి కారిడార్, మెట్రో విస్తరణలు, పట్టణ రవాణా ఆధునీకరణ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పర్యాటకం, పట్టణ పునరుద్ధరణ, విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై కూడా ఈసారి ప్రత్యేక ప్రకటనలు ఉండవచ్చని అంచనా.
అస్సాంలో హైవేలు, రైల్వేలు, వరద నియంత్రణ ప్రాజెక్టులు బడ్జెట్లో ప్రధాన అంశాలుగా కొనసాగుతున్నాయి. ఇటీవలే వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పునాది వేయడం, ఈ ప్రాంతంపై కేంద్రం పెడుతున్న దృష్టిని సూచిస్తోంది. పుదుచ్చేరి విషయంలో పట్టణ మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం మరియు పౌర సౌకర్యాల మెరుగుదలకు కేంద్ర సహాయం కీలకంగా మారనుంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. Budget 2026 మూలధన వ్యయం, తయారీ, ఎగుమతులు, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాలపై దృష్టి సారించడంతో పాటు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అభివృద్ధి వేగాన్ని పెంచేలా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. రాజకీయంగా కీలకమైన ఈ బడ్జెట్ ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్షగా మారనుంని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications