బడ్జెట్ 2026 : 5 రాష్ట్రాల పైనే మోదీ సర్కారు ఫోకస్.. ఆ రెండు రాష్ట్రాలకు మాత్రం భారీగా నిధులు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో వరుసగా తన తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వ ఆదాయ వనరులు, వ్యయ ప్రాధాన్యతలు మాత్రమే కాకుండా, రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశం ఏ దిశగా ప్రయాణించబోతోందన్న దానిపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వనుంది. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బడ్జెట్ 2026కు రాజకీయంగా, ఆర్థికంగా ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల ఈ రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, రంగాల వారీ కేటాయింపులు, కేంద్ర సహాయ ప్రకటనలు బడ్జెట్‌లో కీలకంగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని బడ్జెట్‌లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. అదే ధోరణి ఈసారి కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

Budget 2026 Union Budget 2026 Budget 2026 highlights Nirmala Sitharaman speech Budget 1 February 2026 Budget 2026 announcements Budget 2026 live updates Budget 2026 key takeaways Budget 2026 for states Budget 2026 state-wise announcements Budget 2026 5 states Budget 2026 infrastructure projects Budget 2026 welfare schemes Budget 2026 allocations Budget 2026 development plans Budget 2026 Parliament speech Indian Budget 2026 news Budget expectations 2026 Budget impact on states 2026 2026 1 2026 2026 2026 2026 2026 2026 2026 2026 2026 2026 2026 2026 2026

దేశంలో జనాభా పరంగా, రాజకీయంగా కీలకమైన రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలుస్తోంది. ఇటీవలి కాలంలో రోడ్లు, జాతీయ రహదారులు, పట్టణ రవాణా ప్రాజెక్టులపై కేంద్రం భారీగానే దృష్టి పెట్టింది. కోల్‌కతా నుంచి సిలిగురి వరకు విస్తరించే ఆర్థిక కారిడార్, జాతీయ రహదారి విస్తరణ, మెట్రో రైలు ప్రాజెక్టులు, ఓడరేవు ఆధారిత మౌలిక సదుపాయాలు రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారాయి. రైల్వే రంగంలో కూడా భారీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఇటీవలే హౌరా నుంచి గౌహతి వరకు నడిచే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించడం ఇందుకు ఉదాహరణ. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలోని 100కు పైగా రైల్వే స్టేషన్‌లను వేల కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరిస్తున్నారు.

తమిళనాడులో గత బడ్జెట్‌లు ప్రధానంగా లాజిస్టిక్స్, రవాణా మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించాయి. మధురై-కొల్లం, చిత్తూరు-థాచూర్ వంటి హైవే కారిడార్లు, పారిశ్రామిక పార్కులు, తయారీ మౌలిక వసతులకు కేంద్ర మద్దతు లభించింది. దేశంలో ఒక ప్రధాన తయారీ, ఎగుమతి కేంద్రంగా ఉన్న తమిళనాడులో, పారిశ్రామిక కారిడార్లు, ఓడరేవు కనెక్టివిటీకి మరింత ప్రోత్సాహం లభించే అవకాశముంది.

కేరళ రాష్ట్రం ఇటీవలి సంవత్సరాల్లో హైవేలు, పట్టణ రవాణా వ్యవస్థలు, తీరప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ మద్దతును పొందింది. ముంబై-కన్యాకుమారి కారిడార్, మెట్రో విస్తరణలు, పట్టణ రవాణా ఆధునీకరణ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పర్యాటకం, పట్టణ పునరుద్ధరణ, విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై కూడా ఈసారి ప్రత్యేక ప్రకటనలు ఉండవచ్చని అంచనా.

అస్సాంలో హైవేలు, రైల్వేలు, వరద నియంత్రణ ప్రాజెక్టులు బడ్జెట్‌లో ప్రధాన అంశాలుగా కొనసాగుతున్నాయి. ఇటీవలే వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పునాది వేయడం, ఈ ప్రాంతంపై కేంద్రం పెడుతున్న దృష్టిని సూచిస్తోంది. పుదుచ్చేరి విషయంలో పట్టణ మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం మరియు పౌర సౌకర్యాల మెరుగుదలకు కేంద్ర సహాయం కీలకంగా మారనుంది.

క్లుప్తంగా చెప్పాలంటే.. Budget 2026 మూలధన వ్యయం, తయారీ, ఎగుమతులు, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాలపై దృష్టి సారించడంతో పాటు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అభివృద్ధి వేగాన్ని పెంచేలా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. రాజకీయంగా కీలకమైన ఈ బడ్జెట్ ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్షగా మారనుంని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+