కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో బడ్జెట్ను శనివారం ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం చేసే ప్రకటనలపై దేశం మొత్తం ఓ కన్నేసి ఉంచుతుంది. ముఖ్యంగా వచ్చే ఏడాది ప్రణాళికలు, విధానాలకు సంబంధించి చర్చల దశ ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రసంగానికి ముందు ఏం జరుగుతుందో తెలుసా ? ఇది కాకుండా, బడ్జెట్ ప్రసంగం సమయంలో తరువాత ప్రభుత్వం ఎం చేస్తుంది? బడ్జెట్ ప్రకటనపై పార్లమెంటు ఏం చేయగలదు?
1. బడ్జెట్ ప్రసంగానికి ముందు ఏం జరుగుతుంది?
*భారతదేశంలో బడ్జెట్ ప్రవేశ పెట్టె తేదీ ఫిబ్రవరి 1. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8.40 గంటల ప్రాంతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నివాసం నుంచి బయలుదేరి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుకుంటారు. తరువాత 9 గంటల ప్రాంతంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందు తన బడ్జెట్ బృందంతో ఆర్థిక మంత్రి ఫోటో సెషన్ నిర్వహిస్తారు.

*అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం ఆమె బయలుదేరుతారు. అక్కడ రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఆర్థిక మంత్రి, రాష్ట్ర మంత్రితో కలిసి ఆమె పార్లమెంటు భవనానికి చేరుకుంటారు. ఇక్కడ మళ్లీ బడ్జెట్ నేతలందరి ఫోటో సెషన్ ఉంటుంది. అనంతరం కేబినెట్ సమావేశానికి హాజరై బడ్జెట్ ఆమోదం ఉంటుంది.
2. బడ్జెట్ ప్రసంగంలో నియమాలు ఏమిటి?
*బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెడతారు. ఇందుకోసం ఆర్థిక మంత్రి బడ్జెట్లోని ప్రణాళికలు, విధానాలను మౌఖికంగా సమర్పిస్తారు. అందుకే 'బడ్జెట్ స్పీచ్' అంటారు.
*సాధారణంగా ఆర్థిక మంత్రి తన స్థానంలో నిలబడి బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతారు. ఇప్పటి వరకు ఉన్న చరిత్రను పరిశీలిస్తే, నిర్మలా సీతారామన్ భారతదేశ చరిత్రలో అత్యంత పొడవైన బడ్జెట్ ప్రసంగం చేశారు.
*స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతి తక్కువ బడ్జెట్ ప్రసంగాన్ని 1977లో హిరూభాయ్ ఎం. పటేల్ చేశారు. ఆయన కేవలం 800 పదాల మధ్యంతర బడ్జెట్ ప్రసంగం చేశారు.
నిర్మలా సీతారామన్ ప్రసంగాల వ్యవధి ఎంత?
*సాధారణంగా ఇప్పటి వరకు ఆర్థిక మంత్రుల ప్రసంగాల సగటు వ్యవధి 60 నిమిషాల నుంచి 120 నిమిషాల వరకు ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో బడ్జెట్ ప్రసంగం ఒక గంట కంటే తక్కువ సమయం ఇంకా కొన్ని సందర్భాలలో రెండు గంటలు కూడా దాటింది.
*2019 సంవత్సరంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-2020 ఆర్థిక సంవత్సరానికి తన మొదటి బడ్జెట్ను సమర్పించారు. అప్పుడు తన స్పీచ్తో ఆమె సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డును బద్దలు కొట్టారు. ఆమె రెండు గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు.
*తరువాత సంవత్సరం, ఆమె 2020-21 సంవత్సరానికి బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడు రెండు గంటల 42 నిమిషాల పాటు మాట్లాడి తన రికార్డును తానే బద్దలు కొట్టారు. అది కూడా పూర్తి ప్రసంగం చేయలేదు! ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె తన ప్రసంగాన్ని తగ్గించవలసి వచ్చినప్పుడు రెండు పేజీలు అలాగే మిగిల్చింది.
*2021-22లో ఆమె బడ్జెట్ ప్రసంగం 100 నిమిషాలు. 2022-23 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గంటన్నర మాత్రమే మాట్లాడారు.
బడ్జెట్ ప్రసంగం తర్వాత ప్రక్రియ ఏమిటి?
సాంప్రదాయం ప్రకారం, పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం తర్వాత, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఆర్థిక కార్యదర్శి అలాగే ఇతర కార్యదర్శులు బడ్జెట్ అనంతర విలేకరుల సమావేశానికి హాజరవుతారు. ఇక్కడ ఆమె బడ్జెట్కు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలను స్పందిస్తారు. బడ్జెట్ సంబంధించిన అన్ని సందేహాలు, ముఖ్యమైన విషయాలపై సమాచారం ఇస్తారు.
ప్రెస్ మీట్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఉద్దేశించి ఆర్థిక మంత్రి ప్రసంగిస్తారు. కేంద్ర బడ్జెట్కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఆమె వారికి తెలియజేస్తుంది. ఇందులో ట్రెజరీ సేకరణకు సంబంధించిన రోడ్మ్యాప్ నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పాలసీ వరకు అన్నీ కూడా వివరించి ఉంటుంది. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చేసిన ప్రకటనలపై కూడా ఆర్థిక మంత్రి చర్చిస్తారు. భారతదేశంలో బడ్జెట్ అనంతర సంప్రదాయంలో ఇది కూడా భాగం.
బడ్జెట్ తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీనిపై తన స్పందనను తెలియజేస్తారు. ఆర్థిక మంత్రి సాయంత్రం 5-6 గంటల మధ్య డిడి న్యూస్కి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. దీని తర్వాత ఆమె ఒక ప్రైవేట్ ఛానెల్కు ఇంటర్వ్యూ కూడా ఇవ్వనుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications