ఎప్పటిలాగే ఈసారి కూడా నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ పై ఇప్పటికే అంచనాలు, ఊహాగానాలు పెరిగాయి. అలాగే కేంద్ర మంత్రి వర్గానికి కొన్ని పరిశ్రమలు సిఫార్సులు కూడా చేసాయి. బడ్జెట్ అనగానే సామాన్యులు ఆశించేది కొత్త పథకాలు, అధిక కేటాయింపులు ఇంకా ధరల పెంపు లేదా ధరల తగ్గింపు.
అయితే 2025-26 బడ్జెట్ పై ఏయే వస్తువులపై పన్ను పెరిగే అవకాశం ఉంది.. ఏయే వస్తువులపై తగ్గే అవకాశం ఉందనే సమాచారం తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం వాషింగ్ మెషీన్, డిష్ వాషర్, మెడికల్ ఎక్విప్ మెంట్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం.

రాబోయే యూనియన్ బడ్జెట్లో దేశీయ తయారీదారులకు ప్రయోజనం చేకూర్చడానికి ఇంకా దిగుమతులను తగ్గించడానికి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ నుండి వైద్య పరికరాల వరకు దిగుమతి చేసుకున్న పూర్తిగా తయారు చేసిన పరికరాలపై కేంద్ర ప్రభుత్వం సుంకాలను పెంచుతుందని విస్తృతంగా భావిస్తున్నారు. దీంతో ఈ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అయితే వాషింగ్ మెషిన్, డిష్ వాషర్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు పెంపు ఏ మాత్రం ఉండొచ్చు అనేది స్పష్టంగా లేనప్పటికీ, ప్రస్తుతం దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై ప్రాథమిక సుంకం 10 శాతంగా ఉంది.
కేంద్ర బడ్జెట్లో దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలపై సుంకం పెంచే అవకాశం ఉందని సమాచారం. వీటిలో ముఖ్యంగా వియత్నాం నుండి దిగుమతి చేసుకున్న BP మెషీన్ అండ్ ఆక్సిమేట్ వంటి వైద్య పరికరాల ధరలను పెంచవచ్చు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇంకా మెడికల్ పరికరాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం తయారీ పరికరాలలో ఉపయోగించే భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశం ఉంది.
దీని వల్ల విడిభాగాల ధరను తగ్గే అవకాశం ఉంది. దేశీయ తయారీదారుల ప్రయోజనాల కోసం అలాగే వాటి ఎగుమతి పోటీతత్వాన్ని పెంచడం కోసం ఈ భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో దేశీయ తయారీదారులు లాభపడతారని భావిస్తున్నారు. అయితే, దిగుమతి సుంకం ఎంత తగ్గుతుందనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. మరోవైపు కొత్త ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ విధానంలో పలు సమూల మార్పులు తీసుకురానున్నట్టు సమాచారం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications