పంచాయతీరాజ్ శాఖకు పెరుగనున్న కేటాయింపులు.. వీటిపైనే ఫోకస్.. ఈసారి 5-10% ఎక్కువ !

మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి మీకు తెలిసిందే. ఈ తరుణంలో వివిధ రంగాలకి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఎలాంటి కేటాయింపులు చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. అయితే FY 2026 కోసం కేంద్ర బడ్జెట్‌లో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు నిధులు 5-10% పెరిగే అవకాశం ఉంది, ఇందులో ఎక్కువ భాగం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA)కి కేటాయించనుంది.

15వ ఆర్థిక సంఘం ప్రకారం, స్థానిక ప్రభుత్వాలు ఇంటి పన్నుల ద్వారా ఏటా రూ.50,000 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. అయితే యూజర్ చార్జీలు, ఆస్తి పన్నుల నుండి ప్రస్తుత ఆదాయం GDPలో 5% కంటే తక్కువగా ఉంది. మింట్ నివేదిక ప్రకారం, మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆస్ట్రేలియా, మెక్సికో వంటి దేశాలు భారత్, చైనాల కాకుండా స్వతంత్రంగా పన్ను రేట్లను నిర్ణయించుకునేందుకు స్థానిక ప్రభుత్వాలను అనుమతిస్తున్నాయని చెప్పారు.

Budget 2025 Allotment for Panchayati Raj Ministry will increase Allocation will be 5-10 more for FY26

OSR మోడల్‌ను స్వీకరించడంపై దృష్టి పెట్టడం
స్థానిక పన్నులు, చార్జీల ద్వారా own source revenue (OSR) పెంచడం ద్వారా గ్రామ పంచాయితీలు (GPs) వంటి స్థానిక సంస్థలకు అధికారం కల్పించేందుకు మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, లక్షద్వీప్ ఇంకా ఈశాన్య రాష్ట్రాల వంటి రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు OSR మోడల్ అనుసరించేలా చేయడం ఈ చర్య లక్ష్యం.

OSRపై కొన్ని కార్యక్రమాలు నియమాలను రూపొందించడానికి ఒక అధ్యయనాన్ని ప్రారంభించడం, సమగ్ర శిక్షణా మాడ్యూల్‌ను అభివృద్ధి చేయడం, GPల పనితీరును చెక్ చేయడానికి పోర్టల్ (SAMMARTH) అభివృద్ధి చేయడం చేపట్టాలని యోచిస్తున్నామని మంత్రిత్వ శాఖ కార్యదర్శి చెప్పారు.

33 రాష్ట్రాలు ఇంకా 12 కేంద్రపాలిత ప్రాంతాలలో OSR నియమాలు లేవు. వీటిలో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం ఇంకా ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. చాలా ఇతర రాష్ట్రాలు స్వంత OSR నియమాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ నిబంధనలు లేని రాష్ట్రాలను ఆర్థిక స్థిరత్వం కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. FY25లో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రూ.1,184 కోట్లు పొందింది. ఈ మొత్తంలో 1,063 కోట్ల రూపాయలను RGSA ప్రాజెక్ట్ కోసం కేటాయించారు.

ఇంటి పన్ను నుండి రాబడి
2020 ఆర్థిక సంవత్సరంలో 28 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను ద్వారా రూ.42,159 కోట్ల వసూళ్లు ఉండవచ్చని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది, అయితే వాస్తవ వసూళ్లు రూ.4,953 కోట్లు మాత్రమే. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ చేసిన పరిశోధన ప్రకారం 78% గ్రామ పంచాయతీలు ఆస్తి, ఇతర సేవలపై పన్నులు విధిస్తున్నాయి. 24 రాష్ట్రాల్లో GPకి సగటు OSR రూ. 371,000గా అంచనా. ప్రతి GPకి సగటు పన్ను ఆదాయం రూ. 329,000 కాగా, పన్నుయేతర ఆదాయం సగటు రూ. 84,000. కొత్త OSR నియమాలను రూపొందించడానికి రిటైర్డ్ ప్రభుత్వ అధికారి సూచనలతో పాటు ఈ అధ్యయనం సిఫార్సులను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+