ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్లో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలో కొన్ని అమలు కాకపోవడం లేదా అమలు ఆలస్యం కావడం జరిగాయి. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన రెండో దశ కింద 2019-20 నుంచి 2021-22 మధ్య 1.91 కోట్ల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత అయిదేళ్లలో 91 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారు. ఈ లోపు నిర్మాణ లక్ష్యం 1.5 కోట్లు కాగా ఆ లక్ష్యం చేరలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 4.5 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారు.
2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి నల్లా నీళ్లు అందించాలని, ఇందుకు రాష్ట్రాలతో కలిసి పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ విధివిధానాల రూపకల్పన డిసెంబర్ 2019 నాటికి పూర్తయింది. అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే ఇది వేగవంతం కావాలి.

2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.1,05,000 కోట్ల విలువైన పెట్టుబడులు ఉపసంహరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు రూ.17 వేల కోట్ల పై చిలుకు మాత్రమే వచ్చాయి. ఎయిర్ ఇండియాను విక్రయించాల్సి ఉంది.
గత బడ్జెట్లో పాన్ - ఆధార్ లింక్, పాన్ స్థానంలో ఆధార్ ఉపయోగించే వెసులుబాటు, రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు మినహాయింపులు, భారత్ బాండ్స్ ఈటీఎఫ్ పేరుతో తొలి కార్పోరేట్ బాండ్, స్టార్టప్స్ కోసం డీడీ ఛానల్స్లో ప్రత్యేక కార్యక్రమం వంటి వాటిని అమలు చేశారు. కాగా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2020న తదుపరి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications